అత్యధిక మెజార్టీ నామాదే!
ఖమ్మం లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన నామా నాగేశ్వరరావు 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం.
ఖమ్మం నగరం, మధిర, న్యూస్టుడే: ఖమ్మం లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన నామా నాగేశ్వరరావు 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. 2019 ఎన్నికల్లో తెరాస(భారాస) నుంచి పోటీ చేసిన నామా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. తాజాగా నామా నాగేశ్వరరావు ఐదోసారి ఎన్నికల బరిలో నిలిచారు.
- ఖమ్మం లోక్సభ స్థానంలో 1957 ఎన్నికల్లో అత్యల్పంగా 5,537 ఓట్ల మెజార్టీతో పీడీఎఫ్(పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్) అభ్యర్థి టి.బి.విఠల్రావు సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేకే రావుపై గెలుపొందారు.
- 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రంగయ్య నాయుడు సమీప సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రంపై 5,918 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత 1996 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం సమీప కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రంగయ్య నాయుడుపై 63,291 ఓట్ల మెజార్టీతో గెలుపొందటం విశేషం.
- 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి తెదేపా అభ్యర్థి మద్దినేని బేబీ స్వర్ణకుమారిపై 8,398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 1,08,888 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి నామా, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరిపై 1,24,448 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
- 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీప తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 11,974 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 4,21,957 ఓట్లు రాగా, నామా నాగేశ్వరరావుకు 4,09,983 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి నారాయణకు 1,87,653 ఓట్లు దక్కాయి.
- 2014 ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో వైకాపా అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావు మధ్య చివరి రౌండ్ వరకు విజయం దోబూచులాడింది. ఓట్ల లెకింపులో మొదటి నుంచి తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్వల్ప ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. చివరికి మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎర్రుపాలెం, మధిర మండలాల ఓట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత వైకాపా అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని 11.974 ఓట్ల ఆధిక్యంతో విజయం వరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నట్టేట ముంచే నకిలీలలు
[ 21-05-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభంకానుంది. ఈ ఏడాది సాగుకు సానుకూల వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయిన అన్నదాతలు ఈసారైనా కాలం కలిసొస్తుందన్న కోటి ఆశలతో ఉన్నారు. -
ఉప ఎన్నికల సమరం.. రసవత్తరం
[ 21-05-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. -
మాతృక.. గిరిపుత్రులకు బాసట..!
[ 21-05-2024]
రెవెన్యూ భూములు కాకుండా.. అటవీశాఖకు సంబంధం లేని మాతృక భూములను భూమిలేని అత్యంత నిరుపేద గిరిజనులకు పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. -
పాతాళానికి పరుగులు
[ 21-05-2024]
గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఇటీవల మండే ఎండలకు జిల్లాలో భూగర్భ జలం పాతాళానికి పరుగులు తీస్తోంది. చెరువులు, కుంటల్లో నీటి జాడ లేక పూర్తిగా ఎండిపోవడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టం పడిపోయింది. -
అర్హులందరికీ రేషన్ కార్డులు: పొంగులేటి
[ 21-05-2024]
రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, ఆరు గ్యారంటీల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దు: కేటీఆర్
[ 21-05-2024]
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హస్తం పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. -
పదవికి వన్నె తెచ్చేందుకే పోటీ: తీన్మార్ మల్లన్న
[ 21-05-2024]
మాజీ మంత్రి కేటీఆర్ అమెరికా నుంచి కాదుగదా అంతరిక్షం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి తీసుకొచ్చినా గెలవలేరని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. -
పట్టభద్రుల సమస్యలపై నిలదీసేందుకు భాజపాకు మద్దతివ్వాలి: ఈటల
[ 21-05-2024]
ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై చట్టసభల్లో నిలదీసేందుకు భాజపా అభ్యర్థికి మద్దతు తెలపాలని ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ కోరారు. -
పునాది దశ దాటని వంతెన
[ 21-05-2024]
అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగుపై వంతెన ఈఏడాది వర్షాకాలంలోనూ అందుబాటులోకి రాకపోవచ్చు. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా పునాది దశ దాటలేదు. -
ఆదివాసీ సంప్రదాయం ‘చల్ల’గుండాలి
[ 21-05-2024]
వేసవి వచ్చిందంటే ఆదివాసీల వద్ద ఆనప(సొరకాయ) బుర్ర ఉండాల్సిందే. ఇది వారికి కదిలే ఫ్రిజ్. గిరిజన ఆచార వ్యవహారాలపై మక్కువ ఉన్న భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ కొద్ది రోజుల నుంచి ఆనప బుర్రను ఉపయోగించి అందులో నీటినే తాగుతున్నారు. -
ఎర్ర చీమల గుడ్లూ.. ఆదివాసీల ఆహారమే..!
[ 21-05-2024]
తెలంగాణ-ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివాసీలు ఏప్రిల్ మాసం చివరిలో ఎర్ర చీమల గుడ్లతో కూర, పచ్చడి తయారు చేసుకుని తింటుంటారు. -
ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
[ 21-05-2024]
ప్రజా ఉద్యమాలతోనే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య అన్నారు. -
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు దరఖాస్తు చేసుకోండి
[ 21-05-2024]
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. -
హత్య కేసు నిందితుల అరెస్టు
[ 21-05-2024]
ఆస్తికోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుణ్ని, అతని రెండో భార్యను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
-
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ