32 కిలోల గంజాయి స్వాధీనం
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులను ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన నిందితులతో పోలీసులు
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులను ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.8 లక్షల విలువ చేసే 32 కిలోల గంజాయి, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఉదయ్కుమార్ కథనం ప్రకారం... మిశాల్ అనే వ్యక్తి సూచన మేరకు సికింద్రాబాద్లో ఉంటున్న సంజయ్సింగ్కు గంజాయి అప్పగించేందుకు ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా బోమిక గ్రామానికి చెందిన భరత్ అలియానా, పద్మతుల అలియానా దంపతులు విశాఖపట్నం నుంచి రైలులో బయలుదేరారు. ఎవరికి అనుమానం రాకుండా సోమవారం ఖమ్మం రైల్వే స్టేషన్లో దిగి మరో రైలులో సికింద్రాబాద్ వెళ్లేందుకు సమీపంలో ఉన్న దేవాలయం వద్ద వేచి ఉన్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి గంజాయిని గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నామని ఇన్స్పెక్టర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నట్టేట ముంచే నకిలీలలు
[ 21-05-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభంకానుంది. ఈ ఏడాది సాగుకు సానుకూల వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయిన అన్నదాతలు ఈసారైనా కాలం కలిసొస్తుందన్న కోటి ఆశలతో ఉన్నారు. -
ఉప ఎన్నికల సమరం.. రసవత్తరం
[ 21-05-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. -
మాతృక.. గిరిపుత్రులకు బాసట..!
[ 21-05-2024]
రెవెన్యూ భూములు కాకుండా.. అటవీశాఖకు సంబంధం లేని మాతృక భూములను భూమిలేని అత్యంత నిరుపేద గిరిజనులకు పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. -
పాతాళానికి పరుగులు
[ 21-05-2024]
గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఇటీవల మండే ఎండలకు జిల్లాలో భూగర్భ జలం పాతాళానికి పరుగులు తీస్తోంది. చెరువులు, కుంటల్లో నీటి జాడ లేక పూర్తిగా ఎండిపోవడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టం పడిపోయింది. -
అర్హులందరికీ రేషన్ కార్డులు: పొంగులేటి
[ 21-05-2024]
రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, ఆరు గ్యారంటీల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దు: కేటీఆర్
[ 21-05-2024]
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హస్తం పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. -
పదవికి వన్నె తెచ్చేందుకే పోటీ: తీన్మార్ మల్లన్న
[ 21-05-2024]
మాజీ మంత్రి కేటీఆర్ అమెరికా నుంచి కాదుగదా అంతరిక్షం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి తీసుకొచ్చినా గెలవలేరని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. -
పట్టభద్రుల సమస్యలపై నిలదీసేందుకు భాజపాకు మద్దతివ్వాలి: ఈటల
[ 21-05-2024]
ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై చట్టసభల్లో నిలదీసేందుకు భాజపా అభ్యర్థికి మద్దతు తెలపాలని ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ కోరారు. -
పునాది దశ దాటని వంతెన
[ 21-05-2024]
అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగుపై వంతెన ఈఏడాది వర్షాకాలంలోనూ అందుబాటులోకి రాకపోవచ్చు. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా పునాది దశ దాటలేదు. -
ఆదివాసీ సంప్రదాయం ‘చల్ల’గుండాలి
[ 21-05-2024]
వేసవి వచ్చిందంటే ఆదివాసీల వద్ద ఆనప(సొరకాయ) బుర్ర ఉండాల్సిందే. ఇది వారికి కదిలే ఫ్రిజ్. గిరిజన ఆచార వ్యవహారాలపై మక్కువ ఉన్న భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ కొద్ది రోజుల నుంచి ఆనప బుర్రను ఉపయోగించి అందులో నీటినే తాగుతున్నారు. -
ఎర్ర చీమల గుడ్లూ.. ఆదివాసీల ఆహారమే..!
[ 21-05-2024]
తెలంగాణ-ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివాసీలు ఏప్రిల్ మాసం చివరిలో ఎర్ర చీమల గుడ్లతో కూర, పచ్చడి తయారు చేసుకుని తింటుంటారు. -
ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
[ 21-05-2024]
ప్రజా ఉద్యమాలతోనే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య అన్నారు. -
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు దరఖాస్తు చేసుకోండి
[ 21-05-2024]
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. -
హత్య కేసు నిందితుల అరెస్టు
[ 21-05-2024]
ఆస్తికోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుణ్ని, అతని రెండో భార్యను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
-
టీజీ 09 9999.. రూ.25.50 లక్షలు
-
మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్
-
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
-
జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
-
గుంటూరు పశ్చిమలో.. పోస్టల్ బ్యాలట్ బాక్సులకు సీలు వేయని అధికారులు