logo

భారీ మెజారిటీతో బలరాం నాయక్ ని గెలిపిద్దాం: మంత్రి తుమ్మల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.

Published : 18 Apr 2024 16:13 IST

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో 15 స్థానాలు గెలిచి సోనియా రాహుల్ గాంధీలకు అప్పగిద్దామని మంత్రి తుమ్మల తెలిపారు. మరోవైపు భారాస నాయకులు మాజీ సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలు ఉండదని ఆరు నెలల్లో పడిపోద్దని కలలు కంటున్నారన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లో జరిగే బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు హాజరుకావాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని