మళ్లీ ప్రజాభిప్రాయసేకరణ..!
ఎన్నికల హామీగా మారిన బందరు పోర్టు నిర్మాణంలో ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదు. అసలు పనులు ప్రారంభిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో
పోర్టు నిర్మాణంపై గందరగోళం
గిలకలదిండి రేవు
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే : ఎన్నికల హామీగా మారిన బందరు పోర్టు నిర్మాణంలో ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదు. అసలు పనులు ప్రారంభిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. ఈనెల 15న పర్యావరణ సంబంధిత అంశాలపై బహిరంగ విచారణ నిర్వహించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.
2006లో ఒకసారి..
బందరు పోర్టు నిర్మాణంపై 2006 సంవత్సరంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత ప్రణాళికలో వివిధ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో 5వేల ఎకరాలకుపైగా భూమి అవసరం అవుతుందని, దానికి సంబంధించిన కసరత్తు చేశారు. ప్రస్తుతం అది 3,700 ఎకరాలకుపైగా మాత్రమే చాలని భావిస్తున్నారు. ఇలా విధానంలో మార్పులు చోటుచేసుకోవడంతోపాటు అప్పటి పరిస్థితులకు, ఇప్పటికి తేడా ఉంటుందని, అందుకే మళ్లీ పర్యావరణ సంబంధిత అంశాలపై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలతో ముడ అధికారులు దానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ నెల 15న మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించి వివిధ సంస్థలు, ప్రతిపాదిత పోర్టు పరిసర గ్రామాలకు చెందిన ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. దీనివల్ల జన జీవనానికి ఇబ్బంది ఉంటుందా, పర్యావరణ కలుషితం, ధ్వని, వాయు కాలుష్యంలాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు తదితర అంశాలపై అభిప్రాయాలు తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు.
ముడ కార్యాలయం
దశలవారీగా ..
మచిలీపట్నం పోర్టుకు 2008లోనే శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడంతోపాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నా వివిధ కారణాలతో పనులు ఇంకా ప్రారంభం కాని దుస్థితి. దీంతో శంకుస్థాపనలతోనే సరిపెట్టినట్లయ్యింది. ప్రభుత్వం దాదాపు రూ.5,834 కోట్ల అంచనా వ్యయంతో తొలి దశలో 6 బెర్తులు నిర్మించేందుకు టెండర్లు పిలిచింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్కడితోనే ఆగిపోయినట్లయ్యింది. ప్రస్తుతం ప్రభుత్వం దశలవారీగా నిర్మాణ పనులు చేపట్టాలని భావిస్తోంది. మొదటి దశలతో 3 బెర్తులు, బ్రేక్వాటర్స్, నావిగేషనల్ ఛానల్స్, ఫ్లోటింగ్క్రాప్ట్లు తదితరాలతో దాదాపు రూ.1860 కోట్లు పెట్టుబడి అవుతుందని అంచనా వేశారు. పలు అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పరిపాలనా భవనం, 3 విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణం, ఫెర్టిలైజర్స్, రసాయనాలు నిల్వచేసే గోదాములు, అగ్నిమాపకకేంద్రం తదితర పనులు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇంకెంత అవసరం..?
ప్రస్తుతం పోర్టు నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి 3,762 ఎకరాల స్థలం అవసరం అవుతుందని నిర్ణయించారు. దీనిలో ఇప్పటికే ప్రభుత్వ భూమితోపాటు, కొనుగోలు చేసినది కలిపి 2,328 ఎకరాలు సిద్ధంగా ఉంది. ఇంకా 1,434 ఎకరాలు అవసరం ఉండగా ల్యాండ్పూలింగ్లో 530 ఎకరాలకుపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు గత మూడేళ్లుగా కౌలు ఇవ్వడం లేదు. దీంతోపాటు వారికి అభివృద్ధి చేసిన స్థలం 1200 గజాలు ఇవ్వాల్సి ఉంది. రోడ్డు, రైలుమార్గాల అనుసంధానానికి కూడా కొంత భూమి కావాలి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థల సంబంధిత అంశాలపై కూడా మళ్లీ సమీక్షించనున్నారు.
కొంత భూమి సేకరించాల్సి ఉంది
పోర్టు నిర్మాణంలో భాగంగా పర్యావరణ అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. రోడ్డు, రైలు మార్గాల అనుసంధానానికి కూడా కొంత భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి సర్వేచేయించి నివేదికను అందజేశాం. ప్రస్తుతం ఎంత భూమి ఉంది, ఇంకెంత అవసరం ఉంది, అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వ, అసైన్డ్భూమి ఉందా లాంటి అంశాలను కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నాం. - శివనారాయణరెడ్డి, ముడ వీసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత