logo

నేతలకు బాట.. ప్రజలకు అవస్థ

డోన్‌లో శనివారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. మంత్రి వచ్చే మార్గంలో పోలీసులు వాహనాలను పూర్తిగా నియంత్రించారు. బస్టాండ్‌ కూడలిలో పోలీసు జీపును అడ్డుపెట్టి మరీ వాహనాలను రానీయకుండా చేశారు.

Published : 26 Jun 2022 01:11 IST

ఆర్థిక మంత్రి పర్యటన నేపథ్యంలో డోన్‌ బస్టాండు ప్రాంతంలో  వాహనాన్ని అడ్డుపెట్టి

స్థానికుల్ని నిలువరిస్తున్న పోలీసులు

డోన్‌లో శనివారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. మంత్రి వచ్చే మార్గంలో పోలీసులు వాహనాలను పూర్తిగా నియంత్రించారు. బస్టాండ్‌ కూడలిలో పోలీసు జీపును అడ్డుపెట్టి మరీ వాహనాలను రానీయకుండా చేశారు. దీంతో పనుల కోసం వెళ్లే జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనాన్ని రావద్దని చెప్పి, అదే మార్గంలో వైకాపా కార్యకర్తల ద్విచక్రవాహన ర్యాలీని మాత్రం అనుమతించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటుగా వైకాపా ప్లీనరీలో పాల్గొన్నారు.

- ఈనాడు, కర్నూలు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని