logo

ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి కార్యక్రమాలు విజయవంతం చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వివరించేందుకు ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లేలా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారని కర్నూలు  పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా  అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Published : 02 Dec 2022 02:54 IST

మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వివరించేందుకు ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లేలా తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారని కర్నూలు  పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ప్రజల మద్దతు పొందేందుకుగాను డిసెంబరు 2 నుంచి 45 రోజులపాటు కార్యక్రమాలు ఉంటాయని.. ఇవి పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పారు. దీనిని అందరూ విజయవంతం చేయాలని కోరారు. ధరల నియంత్రణలో విఫలమవడం.. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను మోసగించిన విధానాన్ని.. ఇసుక, మద్యం, భూదందా, మైనింగ్‌ మాఫియా గురించి.. ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందిని వివరిస్తూ వారి మద్దతు పొందేలా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని