ప్రభుత్వ శాఖల్లో బదిలీలు
రాష్ట్ర వ్యవసాయశాఖ రాయలసీమ జోనల్-4 స్థాయిలో వ్యవసాయాధికారులకు అంతర్గత, అంతర్ జిల్లాల బదిలీలు చేశారు.
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: రాష్ట్ర వ్యవసాయశాఖ రాయలసీమ జోనల్-4 స్థాయిలో వ్యవసాయాధికారులకు అంతర్గత, అంతర్ జిల్లాల బదిలీలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 మంది వ్యవసాయాధికారుల స్థానాలను మార్పు చేయగా కడప జిల్లా నుంచి ఒకరు కర్నూలుకు, అనంతపురం జిల్లా నుంచి ఒకరు నంద్యాల జిల్లాకు బదిలీ అయ్యారు.
పశుసంవర్ధక శాఖలో.. : కర్నూలు జిల్లాలో కృష్ణగిరి మండలం కటారుకొండ పశువైద్యులు బి.సునీల్కుమార్ కనగానపల్లికి, ముక్కెళ్ల పశువైద్యులు వి.వినయ్కుమార్ను కటారుకొండకు బదిలీ చేస్తూ పశుసంవర్ధకశాఖ డైరక్టర్ అమరేంద్రకుమార్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.
కర్నూలు సంక్షేమం, న్యూస్టుడే: అంబేడ్కర్ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్తగా వెంకట్రావ్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కడప జిల్లా సమన్వయకర్తగా పని చేస్తున్నారు. ఇక్కడున్న శ్రీదేవి తూర్పుగోదావరికి బదిలీ అయ్యారు.
జిల్లా సహాయ కమిషనర్కు స్థానచలనం
కర్నూలు నగరం, న్యూస్టుడే: దేవాదాయశాఖ కర్నూలు జిల్లా సహాయ కమిషనర్ ఆదిశేషనాయుడును అనంతపురం జిల్లాకు, అక్కడ సహాయ కమిషనర్గాఉన్న రామాంజనేయులును కర్నూలుకు బదిలీ చేస్తూ శాఖ కమిషనర్ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆదిశేషనాయుడు నాలుగేళ్లుగా కర్నూలు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో జిల్లాలో ఈవోగా పనిచేసిన రామాంజనేయులు పదోన్నతిపై అనంతపురానికి బదిలీ అయ్యారు. ఆయన తిరిగి కర్నూలు జిల్లాకు వస్తున్నారు. వీరిరువురితోపాటు మహానంది, శ్రీశైలం, ఉరుకుంద దేవస్థానాల్లోని కొందరు ఉద్యోగులకు స్థానచలనం కలిగింది.
డిప్యూటీ సర్వేయర్లు సైతం..
కర్నూలు సచివాలయం : సర్వే శాఖలో ఏడుగురు డిప్యూటీ సర్వేయర్లకు బదిలీలు చేస్తూ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా సర్వే ఏడీ పవన్కుమార్ గురువారం తెలిపారు. కర్నూలులో పనిచేస్తున్న జి.తిమ్మారెడ్డిని అన్నమయ్య జిల్లా గాలివీడుకు, ఎస్.అతీఫ్ను కర్నూలు నుంచి నంద్యాలకు, దేవనకొండ సర్వేయర్ అరుణజ్యోతిని ఆలూరుకు, ఆలూరు సర్వేయర్ ఈశ్వరప్రసన్నను సత్యసాయి జిల్లా ఓడిచెర్వుకు, ఎమ్మిగనూరులో పనిచేస్తున్న అశోక్ను సత్యసాయి జిల్లా ఎన్.పి.కుంటకు, కర్నూలులో పనిచేస్తున్న మల్లేశ్వరిని పాణ్యంకు, కర్నూలులో పనిచేస్తున్న శ్రీధర్ను చిత్తూరు ఏడీ కార్యాలయానికి బదిలీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?