సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.
పత్తికొండ, పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. నాడు- నేడు పథకం పరిధిలో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలాయి. పిల్లలకు సౌకర్యాల మాట దేవుడెరుగు.. పూర్తికాని నిర్మాణాలతో అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు మొదలయ్యాయి.. ఎన్నికల ప్రచారాలు సాగుతున్నాయి.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం సమస్యలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి.
మారని తీరు..
* పత్తికొండ మండల పరిధిలోని జూటూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు సుమారు 219 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఐదు గదులు ఉండగా.. ఓ గదిలో నాడు- నేడు సామగ్రి, సిమెంటు నిల్వలు ఉంచారు. మరో గది పాఠశాల సిబ్బంది వినియోగించుకుంటున్నారు. రెండో విడత నాడు- నేడు కింద రూ.48లక్షల వ్యయంతో చేపట్టిన అదనపు గదుల నిర్మాణం ఏడాదిన్నరైనా పూర్తికాలేదు. దీంతో విద్యార్థులు తరగతి గదుల కొరత కారణంగా పాఠశాల వరండా, ఆరుబయట మైదానంలో, చెట్ల కింద కూర్చొని చదువులు సాగించారు. వచ్చే విద్యాసంవత్సరమైనా.. అవస్థలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
* మద్దికెర మండలం అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 69 మంది విద్యార్థులున్నారు. గతంలో ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది. అదనపు గది నిర్మించారు. గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పనులు పూర్తికాలేదు. మొదటి విడతలో ఈ పాఠశాలలో నాడు- నేడు పనులు చేపట్టి పూర్తిచేశారు. అవసరమైన ఈ గది నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేయకుండా ఇలాగే వదిలేశారని స్థానికులు ఆగ్రహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిప్పగిరిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
[ 04-05-2024]
మండల కేంద్రమైన చిప్పగిరి ఎస్సీ కాలనీలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ రిజ్వాన్ శనివారం తెలిపారు. -
తెదేపా అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే పింఛన్
[ 04-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి వద్దకే వృద్ధులకు రూ. 4 వేల పింఛన్, వికలాంగులకు 6 వేల పింఛన్ అందిస్తామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కుమారుడు, మండల ఇన్ఛార్జ్ మల్లికార్జున గౌడ్ అన్నారు. -
రేపు ఆదోనిలో పర్యటించనున్న కేంద్రమంత్రి
[ 04-05-2024]
ఆదోని పట్టణంలో రేపు (ఆదివారం) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారని నియోజకవర్గం భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారధి తెలిపారు. -
ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా శ్రేణులు
[ 04-05-2024]
పట్టణంలోని పదో వార్డులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి తరుఫున మాజీ కౌన్సిలర్ సలాం తెదేపా శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
నర్సాపురంలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 04-05-2024]
నరసాపురం, తిమ్మాపురం గ్రామాల్లో మండల తెదేపా నాయకులు బలరాం గౌడ్, రమాకాంత్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం... -
తెదేపాను గెలిపిస్తే రుణాలు.. పింఛన్లు ఇంటి వద్దకే..
[ 04-05-2024]
రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే రుణాలు, పింఛన్లను ఇంటి వద్దకే పంపిస్తామని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
యువత కలలకు రెక్కలు తొడుగుతాం
[ 04-05-2024]
ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటేయబోతున్నారు.. ‘యువ’ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి.. -
పార్కు స్థలాల్లో నేతల పాగా
[ 04-05-2024]
వారంతా నాలుగో తరగతి ఉద్యోగులు. సొంతిళ్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు.. జట్టు కట్టారు.. పైసా పైసా పొదుపు చేసి స్థలం కొనుగోలు చేశారు.. -
పొలం గట్టున జగన్ కనికట్టు
[ 04-05-2024]
అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు.. విత్తు నుంచి మొదలు విక్రయం వరకు రైతుకు ప్రతి దశలో తోడుగా ఉంటామన్నారు. గద్దెనెక్కారు.. ‘ కర్షక’ పథకాలకు కోత పెట్టారు.. -
జగనాసుర ‘చట్టం’
[ 04-05-2024]
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం-2023పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాటం చేసి హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చినా రాష్ట్రప్రభుత్వం -
తాగునీరందిస్తేనే ఓటేస్తాం.. లేదంటే వేయం
[ 04-05-2024]
మాకు తాగునీరందిస్తేనే ఓటేస్తాం..లేదంటే వేయమని పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామస్థులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడు ప్రదీప్రెడ్డిని నిలదీశారు. -
కుళాయిలు కావాలని వైకాపా నాయకుడి నిలదీత
[ 04-05-2024]
మా కాలనీకి తాగునీటి కుళాయిలు కావాలని ప్రచారానికి వచ్చిన వైకాపా మండల ఇన్ఛార్జి మురళీమోహన్రెడ్డి, ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజులను మహిళలు నిలదీశారు. -
మల్లన్న సాక్షిగా ఉత్తుత్తి శంకుస్థాపనలు
[ 04-05-2024]
శ్రీశైలంలో శాశ్వత అభివృద్ధి పనులకు వైకాపా తన అయిదేళ్ల పాలనలో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. రివర్స్ పాలన చేస్తున్న నేపథ్యంలో భక్తులకు కష్టాల్నే మిగిల్చింది. -
జగన్ జమానా.. దక్కని న్యాయం.. ఆగని దుఃఖం
[ 04-05-2024]
శ్రీశైలం జలాశయం నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారు. -
సూపర్ సేవలకు ‘ప్రైవేటు’కు రండి
[ 04-05-2024]
సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఏకంగా ప్రచార పత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. -
పొంగుతున్న గోవా మద్యం
[ 04-05-2024]
ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, కర్ణాటకతోపాటు సదూరంలో ఉన్న గోవా నుంచి సైతం జిల్లాకు మద్యం భారీగా రవాణా జరుగుతోంది. -
విధుల నుంచి 45 మంది తొలగింపు
[ 04-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 63 మందిపై చర్యలు తీసుకోగా..
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన