logo

మలేరియాపై అవగాహన

మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు.

Published : 25 Apr 2024 11:41 IST

గోనెగండ్ల: మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు.  గురువారం  ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గోనెగండ్లలోని  ప్రభుత్వ వైద్యశాల నుంచి బస్టాండ్ వరకు వైద్య సిబ్బందితో ఆయన ర్యాలీ నిర్వహించారు.  దోమల వ్యాప్తితో మలేరియా జ్వరాలు వస్తాయన్నారు.  దోమలు వ్యాప్తి చెందే  నీటి నిల్వ ప్రదేశాలు, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హనుమంతు పరమేశప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు