భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులోని నంద్యాల చెక్పోస్టు నుంచి కలెక్టరేట్ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానులు క్రేన్ సాయంతో భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ మౌర్యకు నామినేషన్ పత్రం అందించారు. ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. భూకబ్జాదారులు, అక్రమార్కులను ఇంటికి సాగనంపుతామని స్పష్టం చేశారు. ఆమెతోపాటు తెదేపా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, జనసేన ఉమ్మడి జిల్లా సమన్వయకర్త చింతా సురేశ్బాబు, భాజపా నేత జీఎస్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పత్తికొండ: కేఈ శ్యాంబాబు (తెదేపా)
పత్తికొండ గ్రామీణం, పత్తికొండ, న్యూస్టుడే: పత్తికొండ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబు బుధవారం వేలాది మంది కార్యకర్తలతో వెళ్లి నామినేషన్ వేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, తెదేపా, జనసేన, భాజపా నాయకులు తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకటరాముడు, రాజశేఖర్, సుబ్బరాయుడు, మనోహర్చౌదరి, కేఈ హరిబాబు, కేఈ వేణు, ఆలంకొండ నబీ, కేఈ దివాకర్, శంకరయ్య, దండి మల్లికార్జున, తిమ్మయ్యచౌదరి, పూనామల్లికార్జున, బలరాంగౌడ్, శ్రీరాములు, చిట్యాల రాజు తదితరులు పాల్గొన్నారు.
అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన పేరుపై రూ.3.23 కోట్ల స్థిరాస్తులు, రూ.1.19 కోట్ల అప్పులున్నట్లు చూపారు. ఆయన సతీమణి సునీత పేరుపై రూ.5.54 కోట్ల స్థిర, చరాస్తులున్నట్లు పేర్కొన్నారు.
కోడుమూరు: బొగ్గుల దస్తగిరి (తెదేపా)
కర్నూలు నగరం, కర్నూలు గ్రామీణం, న్యూస్టుడే: కోడుమూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఆయన కర్నూలులోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శేషిరెడ్డికి రెండు సెట్ల నామపత్రాలు అందించారు. తెదేపా తరఫున ఎం.సుధారాణి ఒక సెట్ నామినేషన్ వేశారు. అభ్యర్థి వెంట తెదేపా సీనియర్ నేత విష్ణువర్దన్రెడ్డి, పార్టీ పరిశీలకులు రామిలింగారెడ్డ్డి ఉన్నారు. అంతకుముందు విష్ణువర్దన్రెడ్డి నివాసం నుంచి బొగ్గుల దస్తగిరి తెదేపా నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు. బాణసంచా కాల్చుతూ ఊరేగింపుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి పరిగెల మురళీకృష్ణ మరోసారి రెండు సెట్లు, బీఎస్పీ అభ్యర్థి గిరిపోగు జయరాజ్ ఒక నామినేషన్ దాఖలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నర్సాపురంలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 04-05-2024]
నరసాపురం, తిమ్మాపురం గ్రామాల్లో మండల తెదేపా నాయకులు బలరాం గౌడ్, రమాకాంత్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం... -
తెదేపాను గెలిపిస్తే రుణాలు.. పింఛన్లు ఇంటి వద్దకే..
[ 04-05-2024]
రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే రుణాలు, పింఛన్లను ఇంటి వద్దకే పంపిస్తామని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
యువత కలలకు రెక్కలు తొడుగుతాం
[ 04-05-2024]
ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటేయబోతున్నారు.. ‘యువ’ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి.. -
పార్కు స్థలాల్లో నేతల పాగా
[ 04-05-2024]
వారంతా నాలుగో తరగతి ఉద్యోగులు. సొంతిళ్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు.. జట్టు కట్టారు.. పైసా పైసా పొదుపు చేసి స్థలం కొనుగోలు చేశారు.. -
పొలం గట్టున జగన్ కనికట్టు
[ 04-05-2024]
అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు.. విత్తు నుంచి మొదలు విక్రయం వరకు రైతుకు ప్రతి దశలో తోడుగా ఉంటామన్నారు. గద్దెనెక్కారు.. ‘ కర్షక’ పథకాలకు కోత పెట్టారు.. -
జగనాసుర ‘చట్టం’
[ 04-05-2024]
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం-2023పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాటం చేసి హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చినా రాష్ట్రప్రభుత్వం -
తాగునీరందిస్తేనే ఓటేస్తాం.. లేదంటే వేయం
[ 04-05-2024]
మాకు తాగునీరందిస్తేనే ఓటేస్తాం..లేదంటే వేయమని పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామస్థులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడు ప్రదీప్రెడ్డిని నిలదీశారు. -
కుళాయిలు కావాలని వైకాపా నాయకుడి నిలదీత
[ 04-05-2024]
మా కాలనీకి తాగునీటి కుళాయిలు కావాలని ప్రచారానికి వచ్చిన వైకాపా మండల ఇన్ఛార్జి మురళీమోహన్రెడ్డి, ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజులను మహిళలు నిలదీశారు. -
మల్లన్న సాక్షిగా ఉత్తుత్తి శంకుస్థాపనలు
[ 04-05-2024]
శ్రీశైలంలో శాశ్వత అభివృద్ధి పనులకు వైకాపా తన అయిదేళ్ల పాలనలో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. రివర్స్ పాలన చేస్తున్న నేపథ్యంలో భక్తులకు కష్టాల్నే మిగిల్చింది. -
జగన్ జమానా.. దక్కని న్యాయం.. ఆగని దుఃఖం
[ 04-05-2024]
శ్రీశైలం జలాశయం నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారు. -
సూపర్ సేవలకు ‘ప్రైవేటు’కు రండి
[ 04-05-2024]
సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఏకంగా ప్రచార పత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. -
పొంగుతున్న గోవా మద్యం
[ 04-05-2024]
ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, కర్ణాటకతోపాటు సదూరంలో ఉన్న గోవా నుంచి సైతం జిల్లాకు మద్యం భారీగా రవాణా జరుగుతోంది. -
విధుల నుంచి 45 మంది తొలగింపు
[ 04-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 63 మందిపై చర్యలు తీసుకోగా..
తాజా వార్తలు (Latest News)
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?