logo

పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం

విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్‌లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్‌ మూర్తి బుధవారం తెలిపారు.

Published : 25 Apr 2024 05:26 IST

చౌడేపల్లె, న్యూస్‌టుడే: విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్‌లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్‌ మూర్తి బుధవారం తెలిపారు. పాఠశాల నుంచి 111 మంది పరీక్షలు రాయగా.. 110 మంది ఉత్తీర్ణులైనట్లు వివరించారు. వీరిలో జి.వైష్ణవి 583 మార్కులతో మంచి ప్రతిభ చూపినట్లు పేర్కొన్నారు. చార్మిల 577, రుషిత 572, కార్తీక్‌ 571, గణేష్‌ 571 సాధించినట్లు తెలిపారు. 36 మంది విద్యార్థులకు 500 మార్కులకు పైగా సాధించారు.  విద్యార్థులను ప్రిన్సిపల్‌ జ్యోతిరాణి, ప్రధానోపాధ్యాయిని కరుణ, అకడమిక్‌ అడ్వజైర్‌ పురుషోత్తమరెడ్డి, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ నాయుని గురుప్రసాద్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని