కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు.
ఆయన భార్య పేరుతో 164.33 ఎకరాలు
ఈనాడు, కర్నూలు : పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సవరించిన అంశాలతో కూడిన అఫిడవిట్ను ఆయన మంగళవారం అధికారులకు సమర్పించారు. కాటసాని, ఆయన సతీమణి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిపై ఉన్న చరాస్తుల విలువ రూ.26.95 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ రూ.48.24 కోట్లుగా ఉంది. మొత్తం ఆస్తుల విలువ రూ.75.19 కోట్లు.. అప్పులు రూ.3.01 కోట్లుగా చూపారు. కాటసాని పేరుతో 10.87 ఎకరాల భూమి, ఆయన సతీమణికి 164.33 ఎకరాలు, కుమారుడికి 64.56 ఎకరాలు, ఒక కుమార్తెకు 2.93 ఎకరాలు, మరో కుమార్తెకు 2.91 ఎకరాలు ఉన్నట్లు చూపారు. ఆయన సతీమణికి మొత్తం 34 చోట్ల, కుమారుడికి 20 చోట్ల ఆయా భూములున్నాయి.
ఒకే ఒక్క కేసు..: కాటసాని రాంభూపాల్రెడ్డిపై కర్నూలు మూడో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో ఒకే ఒక్క కేసు ఉండడం గమనార్హం. అదికూడా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి డబ్బులు పంపిణీ చేశారన్నది ఆరోపణ. సెక్షన్ 171(ఇ) కింద ఆ కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్షణ మంత్రి మాట
[ 06-05-2024]
ఆదోని పట్టణం భీమాస్ సర్కిల్లో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, వేదికపై ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారధి, ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగార్జున తదితరులు -
భూపత్రం.. జగన్ కుతంత్రం
[ 06-05-2024]
‘‘దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రారంభించాం.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో.. డ్రోన్ల సాయంతో ప్రతి క్షేత్రం, పొలం చిత్రపటాలు తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా.. భూ విస్తీర్ణంలో తేడాలు లేకుండా రైతులకు కచ్చితమైన కొలతలు వేయించి, రీసర్వే చేయించి శాశ్వత భూహక్కు పత్రాలు అందిస్తున్నట్లు’’ జగన్ పదేపదే చెబుతున్నారు. -
ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తా
[ 06-05-2024]
ఆదోని పట్టణంతో పాటు పల్లెలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందిస్తానని ఆదోని భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారథి హామీ ఇచ్చారు. -
నిర్వహణ లోపాలు.. వెలగని దీపాలు
[ 06-05-2024]
నగరం, పట్టణాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతామని వైకాపా ప్రభుత్వం పదేపదే చెబుతూ వచ్చింది. తీరా పురవీధుల్లో చీకట్లు నింపింది. వీధి దీపాల నిర్వహణ కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నామని ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. -
పార్కులు ఏర్పాటుచేయని పాలకులు మాకొద్దు
[ 06-05-2024]
కర్నూలు నగర పరిధిలోని కల్లూరు 19వ వార్డు నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో పార్కు స్థలం అన్యాక్రాంతమైందని.. తమకు పార్కు కావాలని ఆ కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి నిరసన గళం
[ 06-05-2024]
పెద్దకడబూరు మండలంలో రెండో రోజు ఆదివారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేపట్టిన ప్రచార యాత్రలో ఊరూరా తాగునీటి సమస్యలు వెల్లువెత్తాయి. జాలవాడి గ్రామస్థులు తాగునీరందించాలని కోరారు. -
ఓట్ల బాట
[ 06-05-2024]
గుంతలు పడ్డాయి.. ప్రయాణానికి ‘దారి’ చూపండని ఐదేళ్లుగా పల్లె జనం విన్నవించినా పట్టించుకోలేదు.. తీరా ఎన్నికల వేళ ‘ఓట్ల’ దారి చూస్తోంది జగన్ సర్కారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.190 కోట్లతో 39 రహదారులను (256 కి.మీ.) ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్మిస్తోంది. -
నేటి నుంచి ఉద్యోగుల ఓటు
[ 06-05-2024]
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటూ.. దరఖాస్తు చేసుకున్న వారందరికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చు. -
అమ్మఒడి.. మామ చిక్కుముడి
[ 06-05-2024]
అక్కచెల్లెమ్మలు.. అవ్వాతాతలు అంటూ తీయని మాటలతో బురిడీ కొట్టించడంలో సీఎం జగన్ది అందె వేసిన చేయి.. ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన పథకాల పేరుతో అలవికాని హామీలు ఇచ్చి.. అమలు విషయంలో మాత్రం మాయ చేయడం.. ఏవేవో నిబంధనలంటూ కోతలు వేయడం పరిపాటిగా మారింది.