logo

ఎన్నికల సమయంలో గొడవలు సృష్టిస్తే కేసులే..

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య అన్నారు.

Updated : 30 Apr 2024 12:06 IST

గోనెగండ్ల: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామాలలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. గ్రామంలోని సమస్యల పైన  ప్రజలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ఇరు పార్టీలకు చెందిన వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని