ఆయుష్మాన్ భారత్ సేవలకు.. రేషన్ కార్డుల గ్రహణం!
రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా రూ.2 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తోంది.
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే : రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులున్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా రూ.2 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా పేదలకు అందుతున్న వైద్య సేవలను కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని నిరుపేదల కోసం రూ.5 లక్షల వరకు వైద్య సేవలు అందిచేందుకు ఆయుష్మాన్ భారత్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆహార భద్రత కార్డుల్లో పేర్లు నమోదై ఉన్నవారందరూ ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తూ ప్రత్యేక కార్డులు జారీ చేస్తోంది. రేషన్కార్డుల్లో పేర్లు లేని వారికి ఈ పథకం వర్తించడం లేదు. దీంతో లక్షలాది మంది వైద్య సేవలు పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు.
1,87,487 మంది ఎదురుచూపు
* ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లో వైద్య సేవల కోసం రేషన్కార్డు, ఆధార్కార్డు, ఫోన్ నంబరుతో మీ సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
* గద్వాల పురపాలక సంఘంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా మీసేవ కేంద్రాల నిర్వాహకుల సహకారంతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.
* కార్డుల్లేని వారి పరిస్థితి ఒక లాగా ఉంటే.. కార్డు ఉండి అందులో పేర్లు లేని వారి పరిస్థితి మరోలా ఉంది. అత్యవసర పరిస్థితి ఎదురైతే తమను ఎవరు కాపాడతారని ఆందోళన చెందుతున్నారు. పేర్లు లేని వారి ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకుని నమోదుకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
* జిల్లాలో 12 మండలాలు, 4 పురపాలక సంఘాల పరిధిలో 1,60,252 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం, ఇది వరకే కార్డులు కలిగి అందులో పేర్ల నమోదు కోసం 46,130 దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. 1,87,487 మంది అర్హులైన నిరుపేదలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. * కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం గత ఏడాది జూన్లో ప్రభుత్వం కొంత కసరత్తు చేసినా కార్యరూపం దాల్చలేదు. ఉన్న వాటిలో పేర్ల నమోదుకు అవకాశం కల్పించాలని పేదలు కోరుతున్నారు.
అధికారుల చుట్టూ తిరుగు తున్నా.. : మా కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నాం. రేషన్ కార్డు మంజూరు సమయంలో అందరి పేర్లు కార్డులో నమోదయ్యాయి. నాకు తెలియకుండానే నా పేరు తొలగించారు. నమోదు కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు.
వెంకటేష్, చేనేత కార్మికుడు, బుర్దాపేట, గద్వాల
ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు : కొత్త రేషన్కార్డుల జారీ, పేర్ల నమోదుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. చాలా మంది కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే పేర్లు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది.
రేవతి, సివిల్ సప్లయి అధికారిణి, గద్వాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.