గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. పోలింగ్కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్ల జాబితాపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
కాంగ్రెస్లో పలువురి చేరికతో మారనున్న సమీకరణాలు
ఈనాడు, మహబూబ్నగర్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైంది. పోలింగ్కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్ల జాబితాపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. చివరి ప్రయత్నంగా ఓటర్ల సమీకరణాలను సరి చూసుకుంటున్నారు. 2021లో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో పూర్వ మహబూబ్నగర్లో పార్టీల గుర్తులపై గెలిచిన ప్రజాప్రతినిధులు భారాస నుంచి 1,039(71%), కాంగ్రెస్-241(16.67%), భాజపా-119(8.23%), ఇతరులు-46(3.18 %) ఉన్నారు. 2021 నవంబరులో పాలమూరులోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పూర్తి మెజార్టీ భారాసకు ఉండటంతో ఇద్దరు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారాస ప్రజాప్రతినిధులు కొందరు ప్రస్తుతం కాంగ్రెస్లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత పెద్ద ఎత్తున ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు కాంగ్రెస్లోకి రావడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు మన్నె జీవన్రెడ్డి(కాంగ్రెస్), నవీన్కుమార్రెడ్డి(భారాస) ఇప్పుడు తమకున్న ఓటర్ల బలాబలాలపై దృష్టి సారించారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.
ప్రభుత్వం మారడంతో..: భారాసకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ప్రస్తుతం గోవాలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా క్యాంపులో పార్టీ ముఖ్యుల సమక్షంలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల వీరితో సమావేశమై భారాసకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం క్యాంపులో భారాసకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు మొత్తం 526 మంది ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని కాపాడుకుని ఈ ఓట్లన్నీ తమకే పడేలా పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మిగతా 913 మంది ఓటర్లపై ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా నియోజకవర్గాల వారీగా క్యాంపులకు తరలించారు. గోవా, ఏపీలోని పలు ప్రాంతాలకు కాంగ్రెస్కు చెందిన ప్రజాప్రతినిధులు వెళ్లారు. ఒక్కో శిబిరంలోని ఓటర్లు ఒక్కోచోట ఉండటంతో మొత్తం ఎంత మంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. సుమారు 700 మంది కాంగ్రెస్ శిబిరంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో 80 మంది భాజపాకు చెందిన ప్రజాప్రతినిధులు ఊటీ, కేరళలో ఉన్నట్లు సమాచారం. నారాయణపేట జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆ నేతల క్యాంపునకు ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. భాజపా ఓట్లు ఎవరికి పడతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. మిగిలిన ఓటర్లు స్థానికంగానే ఉంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే గెలవాలంటే మొత్తం పోలైన ఓట్లలో సగానికి కంటే ఒకటి ఎక్కువ రావాలి. శిబిరాల్లో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు తమ పార్టీకే ఓటు వేస్తారా.. క్రాస్ ఓటింగ్ వేస్తారా అన్నది ప్రధాన అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. 28న పోలింగ్ ఉండటంతో ఏ ఒక్క ఓటు చేజారకుండా ప్రధాన పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్