ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళాయె!
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
ఎన్నికల సామగ్రితో బయలుదేరిన సిబ్బంది
ఈనాడు, మహబూబ్నగర్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ బూత్లకు ఎన్నికల సామగ్రిని అధికారులు పంపించారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, కొడంగల్, షాద్నగర్ నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సామగ్రిని తరలించే ముందు అధికారులు ర్యాండమైజేషన్ నిర్వహించారు. మొత్తం 10 రూట్లలో ఎన్నికల సిబ్బంది, సాయుధ బలగాల బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో సామగ్రిని తరలించారు. ఈ ఎన్నికల్లో సెక్టార్, రూట్ అధికారులు, పీవో, ఏపీవోలు కలిపి మొత్తం 450 మంది విధులు నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ ఉండటంతో ఇప్పటికే ఏ విధంగా ఓటు వేయాలనే దానిపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేంద్రంలోకి నలుగురు చొప్పున మాత్రమే ఓటర్లను అనుమతిస్తారు. ఎన్నికల సంఘం నిర్దేశంచిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల పరిశీలకురాలిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతికశాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ వ్యవహరిస్తున్నారు. బుధవారం ఆమె కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎన్నికల సిబ్బందికి విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ పెట్టెలను స్ట్రాంగ్ రూంకు తరలిస్తారు.
బరిలో ముగ్గురు అభ్యర్థులు..
ఉప ఎన్నికల బరిలో 16 మంది నామినేషన్లు వేయగా ముగ్గురి నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 13 మంది బరిలో ఉండగా 10 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరికి బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్రెడ్డి, భారాస నుంచి నవీన్కుమార్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్గౌడ్ పోటీలో ఉన్నారు. 15 రోజులుగా ప్రధాన పార్టీ అభ్యర్థులు అంతర్గత ప్రచారం నిర్వహించారు. ఓటర్లు చేజారిపోకుండా శిబిరాలకు తరలించారు. వీరంతా బుధవారం సాయంత్రానికే కర్ణాటకలోని రాయచూరుకు చేరుకున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా అందులో 644 మంది పురుషులు, 795 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. అత్యధిక ఓటర్లు మహబూబ్నగర్లోని పోలింగ్ కేంద్రంలో 245 మంది ఉండగా, తక్కువ ఓటర్లు కొడంగల్ పోలింగ్ కేంద్రంలో 56 మంది ఉన్నారు. మొదటి ప్రాధాన్యత, రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రాధాన్యత ఓటు ఎలా వేయాలనే దానిపై అభ్యర్థులు ఇప్పటికే ఓటర్లుకు అవగాహన కల్పించారు.
పోలింగ్ సామగ్రి తరలింపు
పోలింగ్ సామగ్రిని పరిశీలిస్తున్న కలెక్టర్ రవి నాయక్, పరిశీలకురాలు వాణి ప్రసాద్
మహబూబ్నగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ జి.రవినాయక్, ఎన్నికల పరిశీలకురాలు వాణి ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం పూర్వ జిల్లా పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాలకు సామగ్రి, బ్యాలెట్ పెట్టెలు తదితరాలు అందజేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో తుది విడత శిక్షణ ఇచ్చి వారికి సామగ్రిని పంపిణీ చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సిబ్బందితోపాటు సాయుధ బలగాల సమక్షంలో ఒక్కో కేంద్రానికి సామగ్రిని తరలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్రావు తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు హక్కుపై మహిళలకు అవగాహన
[ 27-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. -
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్