అంతర్జాల పాఠాలకు ఏర్పాట్లు
కరోనా పరిస్థితుల కారణంతో విద్యార్థులకు మళ్లీ అంతర్జాల తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఈ నెల 16వ తేదీకి సంక్రాంతి సెలవులు ముగిసినా.. కొవిడ్ ఉద్ధృతి వల్ల ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం
8-10 తరగతులకు అవకాశం
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ
కరోనా పరిస్థితుల కారణంతో విద్యార్థులకు మళ్లీ అంతర్జాల తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఈ నెల 16వ తేదీకి సంక్రాంతి సెలవులు ముగిసినా.. కొవిడ్ ఉద్ధృతి వల్ల ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను పొడిగించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాల తరగతులు ప్రారంభం కాలేదు. ప్రైవేట్ బడుల్లో అనధికారికంగా నిర్వహిస్తున్నారు. సర్కారు విద్యాలయాల్లో నేటి (సోమవారం) నుంచి 8-10 తరగతుల విద్యార్థులకు అంతర్జాల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఏర్పాట్లు పూర్తి చేశారని జిల్లా విద్యాధికారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్ల తీరుపై కథనం.
32,190 మంది విద్యార్థులు..
జిల్లాలో ప్రభుత్వ, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలలు 235 ఉన్నాయి. వాటిలో 32,190 మంది 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులున్నారు. వీరికి సోమవారం నుంచి అంతర్జాల తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ బాధ్యతను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్వహించాలి. ఈ నెల చివరి వరకు ఈ ఆన్లైన్ తరగతులు జరిగే అవకాశం ఉండటంతో ప్రతి రోజు.. అందరు విద్యార్థులు పాఠాలు వినేలా చరవాణుల పర్యవేక్షణ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రోజుకు 50 శాతం మంది చొప్పున ఉపాధ్యాయులు పాఠశాలలకు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. బడుల నుంచే విద్యార్థుల హాజరను ప్రధానోపాధ్యాయులు పరిశీలించి జిల్లా విద్యాధికారి కార్యాలయానికి నివేదిక పంపాలి. ఎంత మంది విద్యార్థులు అంతర్జాల తరగతులు వింటున్నారో స్పష్టంగా తెలియజేయాలి. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీరికి పునఃశ్చరణ తరగతులు, వర్క్షీట్లు పంపించడం, నిరంతర మూల్యాంకణం చేయాలని పేర్కొన్నారు.
అందరూ వినేలా చూడాలి
- రాజేశ్, జిల్లా విద్యాధికారి
8-10 తరగతుల విద్యార్థులు అందరూ అంతర్జాల తరగతులు తరగతులు వినేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చొరవ చూపాలి. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM