ధ్రువీకరణ పత్రానికి తప్పని ప్రదక్షిణ!
మనోహరాబాద్ మండలం కాళ్లకల్కు చెందిన ఫయాజ్, ఫౌజ్య దంపతులకు 9, 7, 3 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా తూప్రాన్లోని ఆసుపత్రుల్లో జన్మించారు. గతేడాది నవంబరులో తండ్రి ఫయాజ్ మృతి చెందాడు. తల్లి ఫౌజ్య ఆరు నెలలుగా వీరి జనన ధ్రువీకరణ
తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయంలో పరిస్థితి
ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకోలు
న్యూస్టుడే, తూప్రాన్
తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు
* మనోహరాబాద్ మండలం కాళ్లకల్కు చెందిన ఫయాజ్, ఫౌజ్య దంపతులకు 9, 7, 3 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా తూప్రాన్లోని ఆసుపత్రుల్లో జన్మించారు. గతేడాది నవంబరులో తండ్రి ఫయాజ్ మృతి చెందాడు. తల్లి ఫౌజ్య ఆరు నెలలుగా వీరి జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఆసుపత్రి వారు ఇచ్చిన పత్రాలతో మీసేవా కేంద్రాలకు వెళ్లగా దరఖాస్తు తీసుకోలేదు. మనోహరాబాద్లోనే తీసుకోవాలని వెనక్కి పంపించారు. అక్కడికెళ్తే తమకు సంబంధం లేదని, ఎక్కడ జన్మిస్తే అక్కడే తీసుకోవాలని సూచించారు. ఇలా ఆరు నెలలుగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు.
* మేడ్చల్-మల్కాజిరిగి జిల్లాకు చెందిన పద్మ.. కుతూరు మానస తూప్రాన్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జన్మించింది. ఆమె ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకోగా తూప్రాన్ మండలానికి చెందిన వారికి మాత్రమే ఇస్తామని, ఇతర మండలాల వారికి ఇచ్చేందుకు అవకాశం లేదని దాన్ని మీసేవ నిర్వాహకులు తిరస్కరించారు. కేవలం ఈ ఇద్దరి సమస్యే కాదు.. ఎంతోమందికి ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాధితులు నిత్యం తూప్రాన్ తహసీల్దారు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు.
డివిజన్ కేంద్రం తూప్రాన్లోని తహసీల్దారు కార్యాలయ అధికారులు ధ్రువీకరణ పత్రాల జారీకి నానా కొర్రీలు పెడుతున్నారు. కనీసం విద్యార్థులు చదువునేందుకు అవసరమైన పత్రాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తూప్రాన్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జన్మించిన పిల్లలకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రాల కోసం స్థానికంగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల వచ్చిన తహసీల్దారు పెట్టిన కొత్త నిబంధనలతో వాటిని తిరస్కరిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఆదాయం, కుల, ఈడబ్ల్యూఎస్ పత్రాల జారీలో భూమి ఉంటే పట్టాపాసు పుస్తకాలు, బోనఫైడ్ ఒరిజినల్ సర్టిపికెట్లు సమర్పించాలన్న నిబంధన అమలు చేస్తున్నారు. ఎక్కడ పుడితే అక్కడి నుంచి జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సొంత మండలంలోనే తీసుకోవాలని సూచిస్తుండటం గమనార్హం.
పాఠశాలల్లో చేర్పించేందుకు..
నూతన విద్యాసంవత్సరం ఇటీవల ప్రారంభమైంది. చిన్నారులను పాఠశాలల్లో చేర్పించేందుకు తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. తూప్రాన్లో జన్మించినట్లు ఆసుపత్రి నిర్వాహకులు ఇచ్చిన పత్రం ఆధారంగా మీసేవలో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దారు.. దాన్ని ఆమోదించి ఆర్డీవోకు పంపిస్తారు. అక్కడి నుంచి ప్రొసిడింగ్ పత్రాన్ని జారీ చేస్తారు. దీని ఆధారంగా మీసేవ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాన్ని పొందేందుకు వీలుంటుంది. తూప్రాన్లో మాత్రం ఆయా వాటికి వ్యతిరేకంగా నిబంధనలు పెడుతూ చిన్నారుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారులు స్పందించాలని వారు విన్నవిస్తున్నారు.
తగిన చర్యలు తీసుకుంటాం..
- రమేశ్, అదనపు పాలనాధికారి
తూప్రాన్ తహసీల్దారు కార్యాలయంలో జనన ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటాం. ఇతర ధ్రువీకరణ పత్రాల జారీలోనూ వేగాన్ని పెంచేలా చొరవ చూపుతాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం.
ఇతర పత్రాల జారీలోనూ..
విద్యార్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను త్వరితగతిన జారీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా తూప్రాన్ అధికారులు మాత్రం అవేవీ పట్టనట్లు వ్యవహిస్తున్నారు. కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాల జారీలోనూ కొత్త నిబంధనలు పెట్టి ఇరుకున పెడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10, 15 రోజులు గడుస్తున్నా జారీ చేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులు కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM