8.73 మీ. @ భూగర్భజలాలు
వర్షాకాలంలో తొలినాళ్ల నుంచే వానలు కురవడం మెతుకుసీమకు కలిసొచ్చింది. భారీ వర్షాలు పడటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వనరులు పొంగిపొర్లగా, భూగర్భజల మట్టం పెరిగింది. ఈ ఏడాది జులైతో పోలిస్తే 2.49 మీ. మేర పెరిగింది.
న్యూస్టుడే, మెదక్
వర్షాకాలంలో తొలినాళ్ల నుంచే వానలు కురవడం మెతుకుసీమకు కలిసొచ్చింది. భారీ వర్షాలు పడటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వనరులు పొంగిపొర్లగా, భూగర్భజల మట్టం పెరిగింది. ఈ ఏడాది జులైతో పోలిస్తే 2.49 మీ. మేర పెరిగింది. గతేడాది సెప్టెంబరులో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 10.02 మీటర్లు ఉండగా, ఈ సారి 8.73 మీ.కు చేరింది.
39 శాతం అధికం..
జూన్ నుంచి గత నెల వరకు ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకున్నాయి. సాధారణ వర్షపాతం 741.0 మి.మీ. కాగా, ఇప్పటి వరకు 1,030.3 మి.మీ. మేర నమోదైంది. 39 శాతం (289.3) అధికంగా కురిసింది. జిల్లాలో తూప్రాన్ మండలం మల్కాపూర్లో 1.20, శివ్వంపేట మండలం సిక్లిందాపూర్లో 1.66, మెదక్ పట్టణ పరిధి పిల్లికొట్టాలలో 2.22 మీటర్లు, వెల్దుర్తి మండలం కుకునూర్లో 2.31, టేక్మాల్ మండలం ఎల్లుపేటలో 2.42, శివ్వంపేటలో 2.94, తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 2.96 మీటర్ల అడుగులో నీళ్లు ఉన్నాయి.
6 మండలాల్లో..
గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే ఈ సారి ఆరు మండలాల్లో నీటి మట్టం పెరిగింది. నాలుగు ప్రాంతాల్లో 10 మీ.లోపు నీళ్లు ఉన్నాయి. ఈ సారి సింగూరు ప్రాజెక్టులోకి ఎగువన కురిసిన వానలకు భారీగా వరద వచ్చి చేరడంతో దిగువన ఉన్న ఘనపూర్ ఆనకట్టకు విడుదల చేశారు. ఇప్పటివరకు సుమారు 45 టీఎంసీల మేర వదిలారు. హల్దీ ప్రాజెక్టు, కాలువల్లోకి సైతం నీళ్లు చేరాయి. దీంతో మంజీరా, హల్దీపై నిర్మించిన చెక్డ్యాంల వద్ద జలమట్టం బాగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న నీళ్లు వచ్చే రబీలో పంటల సాగుకు ఉపయుక్తం కానుంది. జిల్లాలో మంజీరా నది పరివాహాక ప్రాంతంతో పాటు హల్దీ ప్రాజెక్టుపై నిర్మించిన చెక్డ్యాంల నుంచి ప్రవాహం కొనసాగడం రైతాంగానికి ఊరటనిచ్చేదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!