logo

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

లోక్‌ అదాలత్‌లో కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని, ఈ నెల 11న కార్యక్రమం నిర్వహించనున్నట్లు న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి జితేందర్‌ పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 02:04 IST

మాట్లాడుతున్న న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి జితేందర్‌

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: లోక్‌ అదాలత్‌లో కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని, ఈ నెల 11న కార్యక్రమం నిర్వహించనున్నట్లు న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి జితేందర్‌ పేర్కొన్నారు. శనివారం మెదక్‌లోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో బ్యాంకర్ల, చిట్‌ఫండ్స్‌, బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీపడదగిన కేసులు త్వరితగతిన పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయాన్ని వృథా చేసుకోకుండా రాజీమార్గం అనుసరించాలని సూచించారు.

* ప్రపంచ క్యాన్సర్‌ నివారణ దినాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మాట్లాడుతూ. ఆరోగ్య రక్షణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొగాకు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని చెప్పారు. జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు చంద్రశేఖర్‌, వైద్యుడు శివదయాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని