logo

కంటి వెలుగు దేశానికే ఆదర్శం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 29 Mar 2023 02:12 IST

శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

శివ్వంపేట, కౌడిపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం శివ్వంపేట మండలం చండి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల కళ్లలో వెలుగులు నింపేందుకు సదరు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఎంతోమంది కళ్ల ఇబ్బందులు తీరుతున్నాయని చెప్పారు. ఎంపీపీ హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మన్సూర్‌, సర్పంచి ఉమ తదితరులు ఉన్నారు. అంతకుముందు కౌడిపల్లిలోని దాసాంజ నేయస్వామి, పోచమ్మ, రేణుకా ఎల్లమ్మ ఆలయాలను ఆయన సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కొత్తగా శివాలయం, గంగమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ ఆలయాలను నిర్మిస్తున్నామని  చెప్పారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాని చెప్పారు. సర్పంచి వెంకటేశ్వర్‌రెడ్డి, సహకార సంఘం వైస్‌ ఛైర్మన్‌ చిన్నంరెడ్డి, మోహన్‌ అగర్వాల్‌, శ్రీధర్‌గుప్త  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని