కరవు ప్రాంతంలో జలకళ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుందని హుస్నాబాద్ శాసనసభ్యుడు వొడితల సతీశ్కుమార్ అన్నారు.
హుస్నాబాద్ శాసనసభ్యుడు వొడితల సతీశ్కుమార్
సహకార సంఘం భవనానికి శంకుస్థాపన చేస్తున్న టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్
హుస్నాబాద్, హుస్నాబాద్ గ్రామీణం, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుందని హుస్నాబాద్ శాసనసభ్యుడు వొడితల సతీశ్కుమార్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం హుస్నాబాద్లోని వేడుక మందిరంలో జరిగిన సాగునీటి దినోత్సవ సంబురాలులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎక్కడ చూసిన ఎండిపోయిన చెరువులు, కుంటలు దర్శనమిచ్చేవన్నారు. నియోజకవర్గంలో 700కుపైగా చెరువులు, కుంటలు ఉన్నాయని ఈవన్నీ జలకళ ఉట్టిపడుతోందన్నారు. గౌరవెల్లి రిజర్వాయరు నిర్మాణం పూర్తి కావచ్చిందని, త్వరలోనే సీఎం కేసీఆర్తో ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. కోహెడ మండలంలోని శనిగరం, సింగరాయ ప్రాజెక్టులకు మరమ్మత్తులు చేయించి సాగునీరందిస్తామని చెప్పారు. శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ ద్వారా ఎల్కతుర్తి, దేవాదుల ద్వారా భీమదేవరపల్లి మండలాలకు, మిడ్మానేరు నుంచి తోటపల్లి ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు సాగునీరు లభిస్తోందన్నారు. హనుమకొండ జడ్పీ ఛైర్మన్ సుధీర్కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్ ఛైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, అదనపు పాలనాధికారి పి.శ్రీనివాసరెడ్డి, హుస్నాబాద్ పురాధ్యక్షురాలు ఆకుల రజిత తదితరులు పాల్గొన్నారు. కోటి ఎకరాల మాగాణం, సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం ప్రభుత్వ పుస్తకాలను శాసనసభ్యుడు, అధికారులు అవిష్కరించారు. సీనియర్ న్యాయవాది గులాబీల మల్లారెడ్డి రచించిన ఎద్దు ఎవుసం, సురుకుల వైద్యం అనే పుస్తకాలను శాసనసభ్యుడు సతీశ్కుమార్, అదనపు పాలనాధికారి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు అవిష్కరించారు.
సహకార రంగంలో గణనీయ అభివృద్ధి
అక్కన్నపేట(హుస్నాబాద్ గ్రామీణం), న్యూస్టుడే: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సహకార రంగంలో గణనీయమైన అభివృది సాధించామని టెస్కాబ ఛైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. బుధవారం అక్కన్నపేట మండలం కట్కూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సతీశ్కుమార్తో కల్సి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. తెలంగాణ రాకముందు రాష్ట్ర సహకార బ్యాంకు రూ.6వేల కోట్లు, జిల్లా సహకార బ్యాంకులన్ని కలిపి రూ.6వేల కోట్ల చొప్పున వ్యాపారం చేయగా ఇప్పుడు అది రూ.20వేల కోట్లకు పెరిగిందన్నారు. మొత్తం రూ.40వేల కోట్ల వ్యాపారానికి పెరిగిందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9 ఏళ్లలో 281 గోదాములు నిర్మిస్తున్నామన్నారు. 62వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేయవచ్చునన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంఘాలను ఆధునీకరణ చేస్తున్నామన్నారు. కొత్తగా ఏర్పాటైన అక్కన్నపేట మండలంలో అదనంగా మరో సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు రూ.20లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సతీష్కుమార్ శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా మంగ, సర్పంచి జిల్లెల అశోక్రెడ్డి, సహకార సంఘం ఛైర్మన్ పంజ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?