ఉద్యమ వేదిక.. చైతన్య గీతిక
రాష్ట్రానికి అభివృద్ధి నమూనా సిద్దిపేట. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన పురిటిగడ్డ. సాహితీ క్షేత్రం.. కళల కాణాచి.. విద్య, వైద్యం, వ్యాపారం, వాణిజ్య రంగాల్లో ప్రత్యేకతను చాటుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 20 సార్లు ఎన్నికలు జరిగాయి.
న్యూస్టుడే, సిద్దిపేట
సిద్దిపేట పట్టణంలో కమాన్
రాష్ట్రానికి అభివృద్ధి నమూనా సిద్దిపేట. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన పురిటిగడ్డ. సాహితీ క్షేత్రం.. కళల కాణాచి.. విద్య, వైద్యం, వ్యాపారం, వాణిజ్య రంగాల్లో ప్రత్యేకతను చాటుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 20 సార్లు ఎన్నికలు జరిగాయి. రాజకీయ దురంధరుల గడ్డగా సిద్దిపేటకు ప్రత్యేక స్థానముంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.. తొలి, మలి దశ స్వరాష్ట్ర సాధన ఉద్యమాల్లో కదం తొక్కిన నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2016 అక్టోబరు 11న జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది.
నియోజకవర్గానికి తూర్పున హుస్నాబాద్, పడమర దుబ్బాక, ఉత్తరాన రాజన్న సిరిసిల్ల, దక్షిణాన గజ్వేల్ నియోజకవర్గం ఉంది. తొలిసారి ఎడ్ల గురువారెడ్డి(పీడీఎఫ్), తర్వాత పీవీ రాజేశ్వరరావు (కాంగ్రెస్), సోమేశ్వర్రావు(స్వతంత్ర), వీబీ రాజు(కాంగ్రెస్) ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీబీ రాజు మంత్రిగానూ పనిచేశారు. అనంతుల మదన్మోహన్ 1970లో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా, ప్రతిపక్ష నేతగానూ తనదైన ముద్ర వేశారు. కేసీఆర్ సిద్దిపేట నుంచి ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ప్రాంతంలో మొదటిసారి డబుల్ హ్యాట్రిక్కు నాంది పలికారు. నాలుగుసార్లు తెదేపా నుంచి, రెండుసార్లు తెరాస నుంచి గెలుపొంది ప్రత్యేకత చాటారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో మంత్రి, ఉపసభాపతిగా వ్యవహరించారు. మంత్రి తన్నీరు హరీశ్రావు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తొలిసారిగా 2004 ఉప ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచి విజయం సాధించిన ఆయన ఇక్కణ్నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా తిరుగులేని మెజార్టీతో ఎన్నికయ్యారు.
అయిదుసార్లు ఉప ఎన్నికలు..
ఇప్పటి వరకు అయిదుసార్లు ఉప ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 1970, 2001, 2008, 2010లో జరిగాయి. 2004లో కేసీఆర్ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా గెలిచారు. దీంతో ఆయన సిద్దిపేట స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గానికి మానేరు మంచినీటి పథకాన్ని సాధించారు. దాని స్ఫూర్తితో రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకానికి అంకుర్పారణ జరిగింది.
కళలు, సాహిత్యంలో ప్రసిద్ధులు..
సిద్దిపేట కళలకు కాణాచి. చిత్రకళా రంగంలో దివంగత డా.కాపు రాజయ్య అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించారు. బాతిక్ చిత్రకళతో దివంగత యాసాల బాలయ్య కళాభిమానుల మనసును దోచుకున్నారు. కవులుగా వేముగంటి నర్సింహాచార్యులు, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఐతా చంద్రయ్య, అమ్మన చంద్రారెడ్డి ప్రసిద్ధులు. దివంగత గుమ్మనగారి లక్ష్మీనర్సింహశర్మ అష్టావధానంలో ఘనాపాటి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు సాధించేలా..
[ 29-04-2024]
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది. -
రణమా.. ఉపసంహరణమా!
[ 29-04-2024]
నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు. -
భారాసతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
[ 29-04-2024]
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
మోదీ.. బీసీ.. ట్రస్టు..
[ 29-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు. -
మహిళా వాణి.. వినిపించదేమి..!
[ 29-04-2024]
మెదక్ లోక్సభ పురుడు పోసుకొని 72 ఏళ్లయింది. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలే ఎంపీలుగా ఎన్నికవడం గమనార్హం. తాజా ఎన్నికల్లోనూ 54 మంది బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థులు శూన్యం.. కీలకమైన చట్టసభల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలుదక్కకపోవడం గమనార్హం. -
కల సాకారమయ్యేలా.. భరోసానిచ్చేలా..
[ 29-04-2024]
ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు. -
తాగేదెలా?
[ 29-04-2024]
జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజున గొడవలు సృష్టించే రౌడీలు, కేడీలు, పాత నేరస్థుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. -
ప్రజాశక్తితో.. ఏడాదిలో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు
[ 29-04-2024]
తాజా వార్తలు (Latest News)
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా