కండక్టర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా
నర్సాపూర్ భాజపా అభ్యర్థి మురళీయాదవ్ గతంలో ఆర్టీసీలో బస్కండక్టర్గా విధులు నిర్వహించారు. అనంతరం కమ్యూనిస్టు నేత చిలుము విఠల్రెడ్డి ప్రోత్సాహంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
నర్సాపూర్ భాజపా అభ్యర్థి మురళీయాదవ్ గతంలో ఆర్టీసీలో బస్కండక్టర్గా విధులు నిర్వహించారు. అనంతరం కమ్యూనిస్టు నేత చిలుము విఠల్రెడ్డి ప్రోత్సాహంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట్లో సీపీఐ, ఆ తర్వాత తెదేపా, భారాస, ప్రస్తుతం భాజపాలో కొనసాగుతున్నారు. నర్సాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచిగా 1995-2000 వరకు కొనసాగారు. అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. రెండోసారి 2000-2005 వరకు సర్పంచిగా కొనసాగారు. 2014-2019 వరకు భారాస ఉమ్మడి జిల్లా అధ్యక్ష పదవిని సైతం నిర్వహించారు. ప్రస్తుతం 2020లో నర్సాపూర్ పురపాలక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. 2022లో భాజపాలో చేరారు. అధిష్ఠానం ఎమ్మెల్యే టికెట్ను కేటాయించగా పోటీకి నిలిచారు.
న్యూస్టుడే, నర్సాపూర్
కొల్చారం మండలం.. మహిళా ఓటర్లే అధికం
కొల్చారం మండలంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 21 గ్రామాల్లో మొత్తం ఓటర్లు 26,107 మంది ఉండగా, పురుషులు 12,552, మహిళలు 13,554 మంది ఉన్నారు. గ్రామాల వారీగా చూస్తే రంగంపేటలో అత్యధికంగా 2,664 మంది ఓటర్లు ఉన్నారు. వెంకటాపూర్లో అతి తక్కువగా 416 మందే ఉన్నారు. వెంకటాపూర్లో మరో ప్రత్యేకత ఏమిటంటే మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండగా, ఇక్కడ పురుషులు అధికంగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డికి ఆధిక్యం లభించగా, 2018లో మాత్రం తెరాస అభ్యర్థి మదన్రెడ్డికి ఆధిక్యం అభించింది. గతంలో ప్రత్యర్థులు ఇద్దరు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు.
న్యూస్టుడే, కొల్చారం
సంపాదనకు.. ఇదే మంచి తరుణం
మండలంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో పాటు బుజ్జగింపులు, డబ్బుల పంపిణీ, మద్యం సరఫరా, మాంసంతో విందులు గల్లీగల్లీలో జరుగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన రెండో శ్రేణి నాయకులు చాలా మంది డబ్బు సంపాదనకు ఇదే మంచి తరుణం అన్నట్లుగా పోటీలు పడి ఓటు ఉన్నవారిని, లేనివారిని తీసుకెళ్లి అభ్యర్థుల సమక్షంలో చేర్పిస్తున్నారు. ఓ నాయకుడు పది మందిని తీసుకెళ్లి అభ్యర్థితో కండువాలు కప్పించగానే మరో నాయకుడు పోటీపడి అంతకుమించి తీసుకెళ్లి కండువాలు వేయిస్తున్నాడు. దీంతో పాటు కొత్తగా చేరిన వారికి విందు ఇవ్వాలని అభ్యర్థి వద్ద డబ్బులు తీసుకుని, ఎంత ఇచ్చారో తెలుపకుండా మద్యంతో సరిపెడుతున్నారు. కొంతమంది ఇదే తరుణం అని అలకపాన్పు ఎక్కుతున్నారు. అభ్యర్థి స్వయంగా ఇంటికి రావడమో లేదా పిలిపించుకోవడమో చేస్తారని తద్వారా అధికంగా డబ్బులు అందుతాయని భావిస్తున్నారు.
న్యూస్టుడే, వెల్దుర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు సాధించేలా..
[ 29-04-2024]
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది. -
రణమా.. ఉపసంహరణమా!
[ 29-04-2024]
నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు. -
భారాసతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
[ 29-04-2024]
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
మోదీ.. బీసీ.. ట్రస్టు..
[ 29-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు. -
మహిళా వాణి.. వినిపించదేమి..!
[ 29-04-2024]
మెదక్ లోక్సభ పురుడు పోసుకొని 72 ఏళ్లయింది. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలే ఎంపీలుగా ఎన్నికవడం గమనార్హం. తాజా ఎన్నికల్లోనూ 54 మంది బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థులు శూన్యం.. కీలకమైన చట్టసభల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలుదక్కకపోవడం గమనార్హం. -
కల సాకారమయ్యేలా.. భరోసానిచ్చేలా..
[ 29-04-2024]
ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు. -
తాగేదెలా?
[ 29-04-2024]
జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజున గొడవలు సృష్టించే రౌడీలు, కేడీలు, పాత నేరస్థుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. -
ప్రజాశక్తితో.. ఏడాదిలో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు
[ 29-04-2024]
తాజా వార్తలు (Latest News)
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా