WhatsApp: వాట్సప్ సాయం.. బాలుడి ఆచూకీ లభ్యం
వాట్సప్ సమూహాల సాయంతో తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించిన సంఘటన వికారాబాద్ పట్టణంలో ఆదివారం జరిగింది. వికారాబాద్ సీఐ శ్రీను తెలిపిన వివరాలు.. వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలోని కొత్రేపల్లికి చెందిన అబ్దుల్నయీం తన ఐదేళ్ల కొడుకును ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ఆర్టీసీ బస్సు డిపో పక్కన ఉన్న మర్రి చెన్నారెడ్డి విగ్రహం దగ్గరికి పని నిమిత్తం వచ్చాడు.
వికారాబాద్, న్యూస్టుడే: వాట్సప్ (WhatsApp) సమూహాల సాయంతో తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించిన సంఘటన వికారాబాద్ పట్టణంలో ఆదివారం జరిగింది. వికారాబాద్ సీఐ శ్రీను తెలిపిన వివరాలు.. వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలోని కొత్రేపల్లికి చెందిన అబ్దుల్నయీం తన ఐదేళ్ల కొడుకును ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ఆర్టీసీ బస్సు డిపో పక్కన ఉన్న మర్రి చెన్నారెడ్డి విగ్రహం దగ్గరికి పని నిమిత్తం వచ్చాడు. ఇతరులతో మాట్లాడుతుండగా, బాలుడు బైక్ దిగి రైల్వే వంతెన మీదుగా కిలోమీటరుకు పైగా నడుచుకుంటూ వికారాబాద్ పట్టణంలోకి ప్రవేశించాడు. బాలుడు కనిపించక పోవడంతో నడుచుకుంటూ ఇంటికే వెళ్లి ఉంటాడని తండ్రి భావించి వెళ్లగా అక్కడికీ రాలేదు. దీంతో ఆందోళన చెందిన అతను బైక్పై పట్టణమంతా గాలించినా ఆచూకీ లభించలేదు. పట్టణంలోకి వెళ్లిన బాలుడు రోడ్డు పక్కన ఏడుస్తూ నిల్చున్నాడు. గమనించిన పలువురు పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతడిని ఠాణాకు తీసుకెళ్లారు. చిరునామాకు యత్నించినా చెప్పలేదు. పోలీసులు పలు వాట్సప్ సమూహాల్లో బాలుడి ఫొటోను పోస్టు చేశారు. రెండున్నర గంటల తరువాత సమాచారం తండ్రికి చేరడంతో ఠాణాకు వచ్చి బాలుడిని తీసుకెళ్లాడు. పోలీసులు చేసిన కృషిని స్థానికులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్తో దేశం సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ
[ 30-04-2024]
భారత్ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. -
కమలదళం.. గెలుపు వ్యూహం
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు భాజపా ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేస్తోంది. -
బరిలో 44 మంది 15 మంది
[ 30-04-2024]
మెదక్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు. -
బడుల బాగుకు నిధులు
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. జిల్లాలో చాలా పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మెతుకుసీమలో త్రిముఖ పోరు
[ 30-04-2024]
మెతుకుసీమ పోరాటాల గడ్డ. దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని అందించిన నేల ఇది. 19వ సారి లోక్సభ ఎన్నికలకు(ఉప ఎన్నికతో) సన్నద్ధమవుతోంది. -
స్వీప్ నడవడి.. చైతన్య ఒరవడి
[ 30-04-2024]
ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఓటు’ పాత్ర అనిర్వచనీయం. పారదర్శకమైన పాలన సాకారం కావాలంటే.. ఒకవేళ ఎన్నికైన తరువాత నిలదీసే హక్కు పొందాలంటే.. ఓటు సద్వినియోగంతోనే సాధ్యం. -
భాజపా మళ్లీ వస్తే ప్రజల జీవితాలు ఆగం
[ 30-04-2024]
భాజపా అధికారం చేపట్టిన పదేళ్లలో దేశంలో అసమానతలు పెరిగాయని ఆచార్య కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సోమవారం తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు ఆగమవుతాయన్నారు. -
వేసవి శిబిరాలు.. విజ్ఞాన వీచికలు
[ 30-04-2024]
వేసవి సెలవులంటే.. చుట్టాల ఇళ్లు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటే. కొందరు ప్లిలలు మాత్రం విజ్ఞానం, నైపుణ్య అంశాలను పెంచుకోవాలని పరితపిస్తుంటారు. -
గతంలో తండ్రి.. ఇప్పుడు తల్లి
[ 30-04-2024]
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు. -
అభ్యర్థులు వీరే..ఇక ప్రచార హోరే!
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
పరిశ్రమల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
[ 30-04-2024]
జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాల వల్ల పలువురు కార్మికులు మరణిస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని జడ్పీ ఉపాధ్యక్షుడు, మరికొందరు జడ్పీ అభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మూడు నెలల్లో 5 గ్యారంటీల అమలు’
[ 30-04-2024]
కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ను భారీ అధిక్యంతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి