సంపాదనలో పేదలకు 2.5 శాతం
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో,
జకాత్ పేరిట దానధర్మాలు
న్యూస్టుడే, జహీరాబాద్ అర్బన్, వెల్దుర్తి
జహీరాబాద్లో సరకులు అందజేస్తూ..
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, జకాత్, ఫిత్రా పేరిట దానధర్మాలకు అంతే ప్రాధాన్యం ఇస్తారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో వివిధ ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రక్రియకు తెరతీశాయి.
సంపాదనలో పేదల హక్కు..: ఎవరి వద్ద అయితే 6 తులాల బంగారం లేక 52.5 తులాల వెండి ఆభరణాలు లేదా అంతే సమానమైన నగదు ఉంటే వారంతా జకాత్కు అర్హులు. మన వద్ద ఉన్న సొమ్మును లెక్కించి అందులో 2.5 శాతం మేర దానం చేయాలి. జకాత్ ఏడాదిలో ఎప్పుడైనా ఇవ్వొచ్చు. రంజాన్ మాసంలో ఇస్తే అధిక పుణ్యఫలం దక్కుతుంది. ఈ నెలలో ఫిత్రా రూపంలో దానధర్మాలు చేస్తుంటారు. ఇంట్లో ప్రతి ఒక్కరి పేరిట 1.250 కిలోల గోధుమలు లేదా అంతే సమానమైన డబ్బు పేదలకు దానమివ్వాలి. తీసుకునే వారు మాత్రం నిరుపేదలై ఉండాలనే నిబంధన విధిగా పాటించాలని మహ్మద్ ప్రవక్త సూచించారు.
పంపిణీకి సిద్ధం చేసిన నిత్యావసరాలు
పింఛన్లు, ఉపాధికి సహకారం: జహీరాబాద్లో రెండు దశాబ్దాలుగా సఫా బైతుల్ మాల్ స్వచ్ఛ సంస్థ పేదల సేవలో తరిస్తోంది. రంజాన్ మాసంలో రేషన్ కిట్లు, దుస్తుల పంపిణీ చేపడుతోంది. ఏటా 300 మంది వరకు అందజేస్తున్నారు. మరోవైపు పేద ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయంతో పాటు భోజన సౌకర్యం కల్పిస్తోంది. ప్రతి నెలా ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తోంది. నిరుద్యోగ యువతులకు కుట్లు, అల్లికలు, కంప్యూటర్లో ఉచిత శిక్షణ ఇస్తూ స్వయం ఉపాధికి తోడ్పాటు అందిస్తోంది. వేసవిలో చలివేంద్రాలు, నామ మాత్రపు రుసుముతో అంబులెన్స్ సేవలతో అపన్నహస్తం అందిస్తుండటం గమనార్హం.
స్తోమత ఉన్నవారంతా ఇవ్వాలి
మహ్మద్ ఇస్మాయిల్, ఇమాం, వెల్దుర్తి
జకాత్ అనేది ఆర్థిక స్తోమత ఉన్న వారికి నిర్దేశించినది. సొంతంగా సంపాదించిన దాని నుంచే దానం చేయాలి. రుణగ్రస్తులైతే ఇందుకు అర్హులు కారు. వర్షాధారంగా పండే ఫలాలు, ధాన్యంపై పదో వంతు, బావులు, బోర్ల ఆధారంగా పండే వాటిపై అయిదో వంతు జకాత్ ఇవ్వాలి. తమ వారికి కాకుండా నిజమైన పేదలకు మాత్రమే ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?