ఉక్కపోత.. బిల్లుల మోత
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి.
వేసవిలో పెరుగుతున్న విద్యుత్తు వినియోగం
మెదక్ టౌన్, న్యూస్టుడే: జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. అందుకు కారణం ఏసీలు, ఫ్యాన్ల వాడకం భారీగా పెరగడంతో విద్యుత్తు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఉక్కపోత కారణంగా రాత్రివేళ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాల వృద్ధితో జీవన ప్రమాణాలు పెరగడంతో ఆ మేరకు ఇళ్లలో విద్యుత్తు వినియోగం పెరిగింది. అదే స్థాయిలో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. జిల్లా పరిధిలో మెదక్, తూప్రాన్ రెండు డివిజన్లు ఉండగా వాటి పరిధిలో మొత్తం 2,04,945 గృహాలకు సంబంధించిన విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా మార్చి నెలలో రూ.4.87 కోట్ల విలువైన బిల్లులు జారీ అయ్యాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కింద 1,08,581 మంది వినియోగదారులకు లబ్ధి చేకూరుతుండగా వాటి విలువ రూ.2.66 కోట్లు రాయితీ రూపంలో ప్రభుత్వం విద్యుత్తు శాఖకు చెల్లిస్తుంది.
లోటు లేకుండా సరఫరా...
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోతులు లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో విద్యుత్తు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. డిమాండ్ ఎంత పెరిగినా మార్చి నెలలో కోతలు, అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేసింది. దీంతో మార్చి నెల 5వ తేదీన రికార్డు స్థాయిలో 10.77 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది.
పొదుపు చర్యలతో....
అధికంగా బిల్లులు వస్తున్న గృహ వినియోగదారుల జీవనశైలిని గమనిస్తే వృథా కూడా అధికంగానే ఉంటుందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరం లేకపోయినా అన్ని గదుల్లో విద్యుత్తు దీపాలను వేయడం, గదుల్లో ఎవరూ లేకపోయిన ఫ్యాన్లు తిరుగుతుండటంతో విద్యుత్తు ఖర్చు అధికమవుతోంది. అవసరం ఉన్నప్పుడే దీపాలు, ఫ్యాన్లు తదితర వస్తువులను ఉపయోగించుకోవడం, స్మార్ట్ స్విచ్లను ఏర్పాటు చేసుకోవడం, 5 స్టార్ రేటింగ్ కలిగిన వస్తువులను మాత్రమే ఉపయోగించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్తును పొదుపు చేసుకునే అవకాశం ఉంటుందని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు.
నిరంతరాయంగా సరఫరా చేస్తాం
- జానకిరాములు, ఎస్ఈ, విద్యుత్తు శాఖ మెదక్ సర్కిల్
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు నిరంతరంగా సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకొని విధులు నిర్వహిస్తున్నాం. మార్చి నెలలతో పోల్చుకుంటే ఏప్రిల్లో వ్యవసాయ బోర్ల వాడకం తగ్గుతుండడంతో అదే స్థాయిలో విద్యుత్తు వినియోగం సైతం తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడంలో రాజీపడే ప్రసక్తే లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్తో దేశం సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ
[ 30-04-2024]
భారత్ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. -
కమలదళం.. గెలుపు వ్యూహం
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు భాజపా ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేస్తోంది. -
బరిలో 44 మంది 15 మంది
[ 30-04-2024]
మెదక్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు. -
బడుల బాగుకు నిధులు
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. జిల్లాలో చాలా పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మెతుకుసీమలో త్రిముఖ పోరు
[ 30-04-2024]
మెతుకుసీమ పోరాటాల గడ్డ. దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని అందించిన నేల ఇది. 19వ సారి లోక్సభ ఎన్నికలకు(ఉప ఎన్నికతో) సన్నద్ధమవుతోంది. -
స్వీప్ నడవడి.. చైతన్య ఒరవడి
[ 30-04-2024]
ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఓటు’ పాత్ర అనిర్వచనీయం. పారదర్శకమైన పాలన సాకారం కావాలంటే.. ఒకవేళ ఎన్నికైన తరువాత నిలదీసే హక్కు పొందాలంటే.. ఓటు సద్వినియోగంతోనే సాధ్యం. -
భాజపా మళ్లీ వస్తే ప్రజల జీవితాలు ఆగం
[ 30-04-2024]
భాజపా అధికారం చేపట్టిన పదేళ్లలో దేశంలో అసమానతలు పెరిగాయని ఆచార్య కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సోమవారం తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు ఆగమవుతాయన్నారు. -
వేసవి శిబిరాలు.. విజ్ఞాన వీచికలు
[ 30-04-2024]
వేసవి సెలవులంటే.. చుట్టాల ఇళ్లు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటే. కొందరు ప్లిలలు మాత్రం విజ్ఞానం, నైపుణ్య అంశాలను పెంచుకోవాలని పరితపిస్తుంటారు. -
గతంలో తండ్రి.. ఇప్పుడు తల్లి
[ 30-04-2024]
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు. -
అభ్యర్థులు వీరే..ఇక ప్రచార హోరే!
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
పరిశ్రమల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
[ 30-04-2024]
జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాల వల్ల పలువురు కార్మికులు మరణిస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని జడ్పీ ఉపాధ్యక్షుడు, మరికొందరు జడ్పీ అభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మూడు నెలల్లో 5 గ్యారంటీల అమలు’
[ 30-04-2024]
కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ను భారీ అధిక్యంతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి