logo

కమనీయం.. రాములోరి కల్యాణం

రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి

Published : 18 Apr 2024 02:50 IST

మెదక్‌లో ఉత్సవమూర్తులు

మెదక్‌ అర్బన్‌: రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. టేక్మాల్‌ మండల పరిధిలోని వేల్పుగొండ రామాచలం గుట్టపై ఉన్న రామాలయంలో నిర్వహించిన కల్యాణానికి మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్‌ కోదండ రామాలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు భాష్యం మధుసూదనాచారి నేతృత్వంలో అర్చకులు రాములోరి కల్యాణాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ రావు దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కల్యాణ వేడుకలో పాల్గొన్నారు. చిలప్‌చెడ్‌ మండలం పరిధిలోని రాందాస్‌గూడ గ్రామంలో నిర్వహించిన  కల్యాణంలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాల్గొన్నారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని