logo

‘ఎన్టీఆర్‌ సేవలు అమోఘం’

తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ వర్ధంతిని మంగళవారం పార్టీ నాయకులు నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా

Published : 19 Jan 2022 04:35 IST

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ వర్ధంతిని మంగళవారం పార్టీ నాయకులు నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. అనంతరం హైదరాబాద్‌ రోడ్‌లో గల ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి తుమ్మల మధుసూదన్‌రెడ్డి, తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, ఆకునూరి సత్యనారాయణ, ఎం.ఏ. రఫిక్‌, కూరెళ్ల విజయ్‌కుమార్‌, గుండు వెంకటేశ్వర్లు, తేలు రవి, సిద్దిక్‌, ఫజల్‌పాష, రాజు తదితరులు పాల్గొన్నారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని