భాజపా పాలనలో సమాఖ్య వ్యవస్థకు భంగం: గుత్తా
భాజపా పాలనలో దేశంలో సమాఖ్య వ్యవస్థకు భంగం కలుగుతుందని శాసన మండలి మాజీ ఛైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సోమవారం సాగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లను భయాందోళనకు గురి చేస్తూ..
సాగర్లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి
నాగార్జునసాగర్, న్యూస్టుడే: భాజపా పాలనలో దేశంలో సమాఖ్య వ్యవస్థకు భంగం కలుగుతుందని శాసన మండలి మాజీ ఛైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సోమవారం సాగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లను భయాందోళనకు గురి చేస్తూ.. వాటికి రాష్ట్రప్రభుత్వాలు సహాయాన్ని అందించలేని విధంగా వ్యవహరిస్తున్నారని.. కమిషన్లను రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వమే నిబంధనలను విధిస్తే, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన నివాసగృహంలో వందలాది మంది కార్యకర్తలతో ఆందోళన నిర్వహిస్తూ నిబంధనలను తుంగలో తోక్కారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్న తెరాస ప్రభుత్వాన్ని దూషిండమే తమ పనిగా భాజపా, కాంగ్రెస్ పార్టీలు పెట్టుకున్నాయన్నారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిచడానికి కృషిచేస్తోందని వివరించారు. ఏ ఉద్యోగికీ నష్టం లేకుండా ప్రభుత్వం చూస్తుందన్నారు. సాగర్లోని నివాసగృహాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నుంచి త్వరలోనే స్పష్టమైన ఆదేశాలు వస్తాయన్నారు. రూ.150 కోట్ల సీడీసీ నిధులతో సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్రెడ్డి, పెద్దవూర జడ్పీటీసీ సభ్యుడు అబ్బిడి కృష్ణారెడ్డి, పుర వైస్ ఛైర్మన్ రఘువీర్, తెరాస నాయకులు బ్రహ్మారెడ్డి, సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
వారం రోజుల్లో 2,356 మందికి పాజిటివ్
నల్గొండ అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో కరోనా బాధితులు క్రమేణా పెరుగుతున్నారు. పొలీసులు, ఇతర ఉన్నతస్థాయి అధికారులు కొవిడ్ నిబంధనలపై నిత్యం ప్రచారం చేస్తున్నా ప్రజల్లో చైతన్యం రావడం లేదు. దీంతో కొవిడ్ బాధితులతో పాటు జ్వరం, జలుబు, దగ్గు, వంటి లక్షణాలున్నవారు ప్రతి ఇంటా కన్పిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జ్వర సర్వేలు చేసి సూచనలు చేయడంతో పాటు బాధితులకు కొవిడ్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రారంభంలో కొవిడ్ వార్డులో ఉండడానికి సుముఖత చూపని బాధితులు ఇటీవల కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనరల్ ఆసుపత్రి వార్డుల్లో చేరుతున్నారు. జిల్లాలో గడిచిన వారం రోజుల్లో కొవిడ్ బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి.
జీవో నం.62ను రద్దు చేయాలంటూ ధర్నా
నాగార్జునసాగర్, న్యూస్టుడే: ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.62ను వెంటనే రద్దు చేయాలని సాగర్ జెన్కో ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జెన్కో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు వంగూరు వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నం.62 జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు పదోన్నతిలో నష్టం కలుగుతుందని.. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంజయ్య, రాజేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్