వంతెన ఇరుకు రాకపోకలకు బెరుకు
సాగర్ ఎడమ కాల్వపై అత్యంత ప్రమాదకరంగా, ఇరుకుగా ఉన్న వంతెనల పునర్నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏటా అధికారులు అంచనాలు వేసి పంపించడం.. అవి కార్యాలయాల్లోనే మిగిలిపోవడం షరామాములుగా మారింది. వాహనదారులు
గరిడేపల్లి, న్యూస్టుడే
మర్రికుంట వద్ద ప్రమాదకరంగా వంతెన
సాగర్ ఎడమ కాల్వపై అత్యంత ప్రమాదకరంగా, ఇరుకుగా ఉన్న వంతెనల పునర్నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏటా అధికారులు అంచనాలు వేసి పంపించడం.. అవి కార్యాలయాల్లోనే మిగిలిపోవడం షరామాములుగా మారింది. వాహనదారులు, స్థానికులకు మాత్రం ఇబ్బందుల నుంచి విముక్తి కలగడంలేదు. జాతీయ రహదారుల నుంచి రాష్ట్రీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న సూర్యాపేట- గరిడేపల్లి రహదారిలోని ఈ దుస్థితి. కాల్వపై రెండు వంతెనలు ఇరుకుగా ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మర్రికుంట గ్రామం వద్ద (93.080 కి.మీ), మరొకటి కుతుబ్షాపురం సమీపంలో(95.010 కి.మీ) ఉన్నాయి. గతంలో మంత్రులు హరీష్రావు, జగదీశ్రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి కొత్త వంతెనల కోసం నిధులు మంజూరుచేస్తామని పలు మార్లు హామీ ఇచ్చారు. ఇది జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా.. కార్యరూపం దాల్చలేదు. మర్రికుంట వంతెన మలుపుల వద్ద ఉండటంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్- విజయవాడ, జనగాం-సూర్యాపేట- ఖమ్మం, తానంచర్ల-రేణిగుంట, తదితర జాతీయ రహదారుల నుంచి ఆంధ్రప్రదేశ్ను అనుసంధానిస్తున్న నార్కట్పల్లి-అద్దంకి రాష్ట్రీయ రహదారికి గరిడేపల్లి-సూర్యాపేట రెండు వరుసల దారి అనుసంధానంగా ఉంది. దగ్గరి దారి కావడంతో లారీలు, భారీ వాహనాల తాకిడి అధికంగా ఉంటుంది. దీనికి తొడు ఆర్టీసీ బస్సులు, సాదారణ వాహనాలు రద్దీ సైతం ఉంటుంది. మర్రికుంట మలుపు ప్రమాదకరంగా ఉండటంతో ఆ ప్రాంతంలో చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి. మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వెళ్లాలంటే ప్రధాన దారి ఇదే. బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాల ప్రజలు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్కు, ఎస్పీ ఆఫీస్ తదితర జిల్లా కార్యాలయాలకు రావాలంటే ఈ దారి గుండానే ప్రయాణించాలి. ఇంతా ప్రాధాన్యత ఉన్నా.. వంతెనలను మరమ్మతులు చేయటంతో శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రహదారిని ఆర్అండ్బీ నిర్వహిస్తుండగా, కాల్వలను ఎన్నెస్పీ చూస్తోంది. దీంతో ఆర్అండ్బీ వంతెనల అభివృద్ధిని పట్టించుకోవటం లేదు. ఎన్నెస్పీ అధికారుల ప్రతిపాదనలను ఉన్నతాధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. గతంలో ఓసారి ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు పంపించినా నిధులు రాలేదు. ఇటీవల ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడి చొరవ తీసుకుని ప్రతిపాదనలు పంపించాలని నిధుల లభ్యతను బట్టి ఏదో ఒక శాఖ నుంచి మంజూరుకి ప్రయత్నించాలని సంకల్పించి ఎన్ఎస్పీˆ అధికారులకు సూచించారు. మరోసారి మర్రికుంట వంతెనకు రూ.2.50 కోట్లకు, కుతుబ్షాపురం వంతెనకు రూ.1.60 కోట్లతో పునర్నిర్మించాలని ఎన్ఎస్పీˆ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కుతుబ్షాపురం వద్ద..
ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి
- రఘు, డీఈఈ, ఎన్నెస్పీ ప్రధాన కాల్వ
మర్రికుంట వంతెనకు ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. మా శాఖ నుంచి మర్రికుంట, కుతుబ్షాపురం వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. రోడ్డు విస్తరించినందున అదే తరహాలో వంతెన నిర్మాణానికి ప్రతిపాదించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!