మూడుముళ్లకు వేళాయె..!
మూడు నెలల తర్వాత ముహూర్తాలు వస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో పెళ్లి సందడి నెలకొంది. వచ్చే నెల 3 నుంచి శుభగడియలు ప్రారంభం కానున్నాయి.
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే: మూడు నెలల తర్వాత ముహూర్తాలు వస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో పెళ్లి సందడి నెలకొంది. వచ్చే నెల 3 నుంచి శుభగడియలు ప్రారంభం కానున్నాయి. మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న పెళ్లిళ్లపై అన్ని రంగాల వారు ఆశలు పెట్టుకున్నారు. డిసెంబరు 1వ తేది నుంచి శుక్రమూఢం తొలగిపోనుంది. 3, 4, 7, 9, 14, 16, 17, 18, తేదీల్లో వివాహాలకు దివ్య ముహూర్తాలుగా వేద పండితులు చెబుతున్నారు. వివాహాలకు, శుభకార్యాలకు నిర్వాహకులు అనేక మంది ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఫంక్షన్హాళ్లను బుక్ చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లిళ్లు నిర్ణయించుకునేవారికి పట్టణాల్లో ఫంక్షన్ హాళ్లు లభించే అవకాశం లేదు. అలాంటి వారు వివాహాలను దేవాలయాలు, ఇళ్ల వద్ద జరుపుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గత మూడు నెలల నుంచి ముహూర్తాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడిన ఫంక్షన్హాళ్ల నిర్వాహకులు ప్రస్తుతం వచ్చే గడియలతో కొంత ఊరట చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు వందలకు పైగా కల్యాణ మండపాలు ఉన్నాయి.
ఫంక్షన్హాల్లో పెళ్లి పందిరి
ముద్రణ రంగం, కల్యాణ మండపాలు, అలంకరణ, పూల వ్యాపారులు, క్యాటరింగ్ వంటచేసేవారు, ఫొటో, వీడియో గ్రాఫర్లు ముందస్తుగా ఆర్డర్లు తీసుకుంటున్నారు. ప్రధానంగా నిర్వహణ, క్లీనింగ్ తదితర పనులపై ఆధారపడ్డ వేల మంది దినసరి కూలీలకు గత మూడు నెలలు గడ్డుకాలంగా మారింది. మరో అయిదు రోజుల్లో పెళ్లిళ్లు ప్రారంభం కానుండటంతో అన్ని రంగాలవారు ఆనందపడుతున్నారు.
పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి
- రాఘవరెడ్డి, ఫంక్షన్హాల్ నిర్వాహకుడు
వచ్చే నెలలో జరిగే పెళ్లిళ్లకు దాదాపు ఫంక్షన్హాళ్లు ముందస్తుగా బుకింగ్ అయ్యాయి. మూడు నెలల నుంచి ఫంక్షన్హాళ్లలో చిన్న చిన్న కార్యక్రమాలు తప్ప ఆడంబరమైన కార్యక్రమాలు జరగలేదు. ప్రస్తుతం వచ్చే నెలలో కూడా ఎనమిది ముహూర్తాలే ఉన్నాయని నిర్వాహకులు ముందస్తుగానే బుక్ చేసుకున్నారు. ఆదాయం కొంత ఆశాజనకంగా ఉంది.
అధికసంఖ్యలో వివాహాలు
-ఫణికుమార్, అర్చకులు
వచ్చే నెల 19 తర్వాత నెల రోజుల పాటు ముహూర్తాలు లేవు. ఆ తర్వాత మాఘం, పాల్గుణ మాసాల్లో ఉన్నాయి. దీంతో మార్గశిర మాసంలోనే శుభకార్యాలు ముగించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. మూడు నెలల నుంచి శుభగడియలు లేకపోవడంతో వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్న ముహూర్తాలను నిర్వాహకులు నిర్ణయించుకుంటున్నారు. దీంతో అధిక సంఖ్యలో వివాహాలు జరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యక్తి దారుణ హత్య
[ 10-05-2024]
మండలంలోని ఆంగోతుతండాలో ఓ వ్యక్తి గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు జగ్రు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు -
నిర్లక్ష్యమా.. అవగాహన లోపమా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకునే వారిలో 90శాతం పైగా ఉన్నత చదువులు చదివిన వారే ఉంటారు -
విమర్శలు చేసే.. విజయం కాంక్షించే
[ 10-05-2024]
భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ప్రజల్లో శాశ్వతంగా గుర్తు ఉండేలా అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి
[ 10-05-2024]
ప్రజలు గత 25 ఏళ్లుగా తనను గెలిపించి.. మంత్రి అయ్యే వరకు తీసుకొచ్చారని శాశ్వతంగా గుర్తు ఉండేలా తాను అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
పారదర్శకంగా లోక్సభ ఎన్నికలు
[ 10-05-2024]
ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.. -
మూత్ర పిండం.. పొంచి ఉన్న గండం
[ 10-05-2024]
మానవునికి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. వాతావరణ పరిస్థితుల్లో భాగంగా కిడ్నీ గండం ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. -
తస్మాత్ జాగ్రత్త.. స్థానికేతరులు వెళ్లాల్సిందే!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు ముందు జిల్లాలో 48గంటల నిబంధనలు పటిష్టంగా అమలు చేయనున్నారు. -
నిరంతరం నిఘా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. -
నాడు హవా.. నేడు నామమాత్రం
[ 10-05-2024]
ఉమ్మడి జిల్లాలో నాడు కమ్యూనిస్టులదే హవా. జాతీయస్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది వారే. ఎన్నిక ఏదైనా గెలుపు కమ్యూనిస్టులదే అనే స్థాయి. -
సరిహద్దులు దాటుతున్న తెలంగాణ మద్యం
[ 10-05-2024]
వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు. -
గట్టెక్కేలా.. ప్రత్యేక వ్యూహం
[ 10-05-2024]
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి -
నిర్బంధం చేస్తేనే.. వస్తారా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు మరో రెండు రోజులు గడువు పెంచడం చూస్తే విద్యావంతులు కూడా ఓటు వేసేందుకు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!