వీధి వ్యాపారుల.. విధిరాత మారేలా..!
వీధి వ్యాపారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. అద్దెలు చెల్లించకలేక.. రోడ్ల వెంట వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.
సూర్యాపేట పురపాలిక, న్యూస్టుడే
సూర్యాపేటలో వీధి వ్యాపారులు
వీధి వ్యాపారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. అద్దెలు చెల్లించకలేక.. రోడ్ల వెంట వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. గత రెండేళ్లగా కొవిడ్ కారణంగా వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడ్డారు. వారిని ఆదుకొనేందుకు ఆత్మనిర్భర్ కింద బడ్జెట్లో రూ.468 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో 37,784 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. యాదాద్రిలో 9,101, నల్గొండలో 17,093, సూర్యాపేటలో 11,590 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఉపాధిని మెరుగుపర్చేందుకు మొదట పీఎం స్వనిధి(ఆత్మనిర్భర్) పథకంలో మొదట రూ.10వేలు రుణంగా అందించారు. తిరిగి చెల్లించిన వారికి రెండో విడత రూ.20వేలు అందజేశారు. ఇవి కూడా సక్రమంగా చెల్లించిన వారికి కేంద్రం రుణ పరిమితి పెంచి రూ.50 వేలు అందజేసింది. వీటితో రోడ్ల వెంట వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి జీవన పరిస్థితిని మరింతగా మెరుగుపర్చేందుకు కేంద్రం రుణపరిమితిని పెంచడంతోపాటు నిధులు కూడా భారీగా పెంచుతోంది. వీటిని సద్వినియోగం చేసుకొని వ్యాపారులు ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చేలా ప్రోత్సహిస్తోంది.
పెరగనున్న రుణం
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులతో రుణం పెరగనుంది. రూ.10 వేల నుంచి రూ.50 వేల పెరిగిన రుణం ఇప్పుడు రూ.లక్ష వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో వ్యాపారం మరింతగా వృద్ధి చేసుకొనే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ పెరగడంతో పాటు ఆదాయం మరింత వృద్ధి కానుంది. దీంతో వ్యాపారులు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నారు.
దుకాణాల ఏర్పాటు
కేంద్రం ప్రకటించిన నిధులతో పురపాలికల్లో దుకాణాలను నిర్మించనున్నారు. కొవిడ్ సమయంలో నిర్మించిన కొన్ని దుకాణాలను వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. నిధుల కొరత కారణంగా అధికారులు సరిపడా దుకాణాలను నిర్మించలేదు. ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వం కేటాయించిన నిధులతో దుకాణాలు నిర్మించుకొనే అవకాశం కలగనుంది. దీంతో వ్యాపారులు రోడ్ల వెంట తోపుడు బండ్లు, రేకుల షెడ్లకు స్వస్తి పలికే అవకాశం ఉంది.
నిధుల కేటాయింపు సంతోషకరం
- ధరావత్ రమేశ్ నాయక్, మెప్మా పీడీ, సూర్యాపేట
కేంద్రం ప్రభుత్వం బడ్జెట్లో వీధి వ్యాపారులకు నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. అర్హులైన వ్యాపారులకు రుణాలు అందించి వ్యాపార నిర్వహణకు సహకరిస్తాం. వ్యాపారులు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యక్తి దారుణ హత్య
[ 10-05-2024]
మండలంలోని ఆంగోతుతండాలో ఓ వ్యక్తి గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు జగ్రు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు -
నిర్లక్ష్యమా.. అవగాహన లోపమా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకునే వారిలో 90శాతం పైగా ఉన్నత చదువులు చదివిన వారే ఉంటారు -
విమర్శలు చేసే.. విజయం కాంక్షించే
[ 10-05-2024]
భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ప్రజల్లో శాశ్వతంగా గుర్తు ఉండేలా అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి
[ 10-05-2024]
ప్రజలు గత 25 ఏళ్లుగా తనను గెలిపించి.. మంత్రి అయ్యే వరకు తీసుకొచ్చారని శాశ్వతంగా గుర్తు ఉండేలా తాను అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
పారదర్శకంగా లోక్సభ ఎన్నికలు
[ 10-05-2024]
ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.. -
మూత్ర పిండం.. పొంచి ఉన్న గండం
[ 10-05-2024]
మానవునికి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. వాతావరణ పరిస్థితుల్లో భాగంగా కిడ్నీ గండం ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. -
తస్మాత్ జాగ్రత్త.. స్థానికేతరులు వెళ్లాల్సిందే!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు ముందు జిల్లాలో 48గంటల నిబంధనలు పటిష్టంగా అమలు చేయనున్నారు. -
నిరంతరం నిఘా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. -
నాడు హవా.. నేడు నామమాత్రం
[ 10-05-2024]
ఉమ్మడి జిల్లాలో నాడు కమ్యూనిస్టులదే హవా. జాతీయస్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది వారే. ఎన్నిక ఏదైనా గెలుపు కమ్యూనిస్టులదే అనే స్థాయి. -
సరిహద్దులు దాటుతున్న తెలంగాణ మద్యం
[ 10-05-2024]
వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు. -
గట్టెక్కేలా.. ప్రత్యేక వ్యూహం
[ 10-05-2024]
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి -
నిర్బంధం చేస్తేనే.. వస్తారా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు మరో రెండు రోజులు గడువు పెంచడం చూస్తే విద్యావంతులు కూడా ఓటు వేసేందుకు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం