వెంకటాపురం వద్ద రోడ్డు ప్రమాదం
తుర్కపల్లి మండలం వెంకటాపురం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, మోటర్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు.
కారు, మోటార్ సైకిల్ ఢీ.. ఇద్దరు మృతి
భువనగిరి మైసయ్య
తుర్కపల్లి, న్యూస్టుడే: తుర్కపల్లి మండలం వెంకటాపురం వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, మోటర్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు, మోటార్ సైకిల్ పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజపేట మండలం నెమిలె గ్రామానికి చెందిన భువనగిరి మైసయ్య, ఎర్ర శంకరయ్య తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో మేస్త్రీ పని చేసేందుకు టీవీఎస్ ఎక్స్ల్పై ఉదయం 9.30కు ఇంటి నుంచి బయలు దేరారు. మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా జవహర్నగర్ (కుషాయిగూడ) ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు బంగారి భానుకుమార్, కారుపల్లి రవికుమార్, ఏతం ఆంజనేయులు, సుంకుశాల అజయ్కుమార్ కారులో యాదగిరిగుట్టకు వెళ్తుండగా దత్తాయిపల్లి-వెంకటాపురం గ్రామాల మధ్య ఉదయం 11.15కు మోటారు సైకిల్ను ఎదురెదురుగా ఢీకొట్టింది. కారు అతి వేగంగా మోటార్ సైకిల్ను 15 మీటర్ల దూరం వరకు కారు ఈడ్చుకుంటూ వెళ్లింది. ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంకు మూత ఊడిపోవటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మోటారు సైకిల్పై ఉన్న ఇద్దరికి మంటలు అంటుకున్నాయి. భువనగిరి మైసయ్య (55) డివైడర్కు ఢీకొనడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఎర్ర శంకరయ్యకు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం హుటాహుటీనా భువనగిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంకరయ్య (50) సాయంత్రం మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు, మోటారు సైకిల్ మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. కారులో ఉన్నవారు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మైసయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వాహనాలకు అంటుకున్న మంటలు ఆర్పివేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్గౌడ్ తెలిపారు.
నెమిలలో విషాదఛాయలు
రాజపేట, న్యూస్టుడే: తుర్కపల్లి మండలం వెంకటాపురంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇరువురు రాజపేట మండలం నెమిల గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇందులో భువనగిరి మైసయ్య స్థానిక గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుడు కాగా, ఎర్ర శంకర్ కూలీ పని చేస్తుంటాడు. ఒకే రోజు ఇదే గ్రామానికి చెందిన ఇరువురి మరణాలు స్థానికులను కలచివేసింది.
చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందిన ఎర్ర శంకరయ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్