ఆశలు ఆవిరై.. గుండెల బరువై!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. మూలిగేనక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి.
అకాల వర్షం.. అపార నష్టం
పెనుగాలులతో కూలిన విద్యుత్తు స్తంభాలు, చెట్లు
సంగం : వర్షానికి నేలకొరిగిన వరి పైరు
న్యూస్టుడే, నెల్లూరు (కలెక్టరేట్, వ్యవసాయం): బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. మూలిగేనక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతకొచ్చిన వరి పైరు వాలిపోయింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 129 గ్రామాల్లో పంట దెబ్బతింది. వరి 3,597.6 హెక్టార్లు, శనగ 600 హెక్టార్లు, పత్తి 252 హెక్టార్లు, నువ్వులు 22 హెక్టార్లు, వేరుశనగ 20 హెక్టార్లలో దెబ్బతింది. జిల్లాలో పంట నష్టాలపై ప్రాథమిక అంచనాలను కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ప్రభుత్వానికి పంపారు.
28.2 మి.మీ.వర్షపాతం
జిల్లాలో ఆదివారం సగటున 28.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బోగోలు 79.8, రాపూరు 74.0, సంగం 60.4, కోవూరు 57.0, నెల్లూరు నగరం 50.0 మి.మీ. వర్షం కురిసింది. ఆత్మకూరు 48.4, కొడవలూరు 48.2, పొదలకూరు 46.2, బుచ్చిరెడ్డిపాళెం 42.6, విడవలూరు 41.4, చేజర్ల 38.0, నెల్లూరు గ్రామీణం 37.2, కొండాపురం 35.0, జలదంకి 33.8, వెంకటాచలం 30.6, అల్లూరు 29.6, దగదర్తి 28.6, మర్రిపాడు 27.2, కలిగిరి 26.8, కావలి 26.8 వింజమూరు 22.4, మనుబోలు 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కలిగిరి మండలం కుమ్మరకొండూరులో గాలుల ప్రభావంతో అపార నష్టం కలిగింది.
కాయాకష్టం.. వర్షార్పణం
కావలి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓరుగుంట కృష్ణవేణి తనకున్న అరెకరాలో మామిడితోటలు సాగు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి కురిసిన గాలి, వడగండ్ల వానతో మామిడి కాయలు, పిందెలు, పూత రాలిపోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అధికారులు మామిడి తోటను పరిశీలించి న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏవి?
తలుపూరుపాడుకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ ఆరెకరాల్లో జిలకర మసూరీ వరి సాగు చేశారు. ముప్పొద్దులా కష్టం చేసి పండించిన ధాన్యాన్ని రహదారి పక్కన రాశి పోసి పడిగాపులు కాస్తున్నారు. శనివారం కురిసిన వర్షానికి నీరు చేరడంతో ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాశిని సంరక్షించేందుకు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
జలదంకిలో పంట నష్టం వివరాలు సేకరిస్తున్న అధికారులు
కుమ్మర కొండూరులో పైకప్పు లేచిపోయిన ఇల్లు
తడిచిన మిర్చి
నీటిలోనే పత్తి పైరు
గాలులకు ఇంటిపై కూలిన విద్యుత్తు స్తంభం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?