కనుపాప వెలిగి.. కన్నపేగు ఒరిగి
అమ్మ.. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. వారి క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. బిడ్డల కష్టాలు.. కన్నీళ్లు తనవిగా చేసుకుంటుంది..
ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళల మృతి
న్యూస్టుడే, నెల్లూరు (నేర విభాగం)
షాహీనా (పాత చిత్రం)
అమ్మ.. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. వారి క్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. బిడ్డల కష్టాలు.. కన్నీళ్లు తనవిగా చేసుకుంటుంది..
వారి ఉన్నతికి ఎంత కష్టమైనా భరిస్తుంది.. శ్రమిస్తుంది.. అలాంటిది.. కన్నబిడ్డ ప్రాణాలకే ఆపదొస్తే.. నిలువగలదా!
తన ప్రాణాలనే అడ్డేస్తుంది.. బిడ్డకు పునర్జన్మనిస్తుంది.. నెల్లూరులో బుధవారం అదే జరిగింది... ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిన ఓ బిడ్డను కాపాడి.. ఇద్దరు తల్లులు తనువు చాలించడం అందరినీ కలచివేసింది.
నెల్లూరు భగత్సింగ్ కాలనీలో తిరుమల, సబిహా(29) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిది ప్రేమ వివాహం. వీరికి ముగ్గురు కుమారులు. సబిహా నగరంలోని ఓ దుకాణంలో పని చేస్తుండగా- తిరుమల వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వీరి ఇంటికి ఎదురుగా షాహీనా(25) తన కుమార్తెతో కలిసి ఉంటోంది. బీడీలు చుట్టి కుమార్తెను పోషించుకుంటోంది. సబిహా, షాహీనా స్నేహితులు. బుధవారం వీరిద్దరి పిల్లలు పెన్నానది తీరంలో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలో సబిహా మూడేళ్ల కుమారుడు రీహాన్ గుంతలో పడి మునిగిపోతుండగా గుర్తించిన సబిహా, షాహీనా అక్కడికి పరుగులు తీశారు. అతి కష్టంపై రీహాను గుంతలో నుంచి గట్టుపైకి చేర్చారు. ఆ ప్రయత్నంలో వారిద్దరూ కాలుజారి అందులో పడిపోయారు. ఈతరాక నీటిలో మునిగిపోయారు. విషయం గుర్తించిన ఓ మహిళ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గుంతలోకి దిగారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని పైకి తీసుకొచ్చి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ డి.శ్రీనివాస్రెడ్డి, నవాబుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
తీరని విషాదం.... జరిగిన దుర్ఘటనతో భగత్సింగ్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. సబిహా ప్రేమ వివాహం చేసుకుంది. భర్త వేరే రాష్ట్రంలో ఉండగా.. ముగ్గురు పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటోంది. షాహీనా కుటుంబంలో పెద్ద దిక్కు. ఒక్కగానొక్క కుమార్తెతో కలిసి జీవిస్తోంది. ఆమె మృతి చెందడంతో ఆరేళ్ల కుమార్తె అమ్మ ప్రేమకు దూరమైంది. ఆ పిల్లలు విలపిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు.
తల్లి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరవుతున్న సబిహా కుమారుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు