పునరావాసం.. దొరకని స్థలం
ఓడరేవు నిర్మాణంలో భాగంగా తొలగించిన గ్రామాల వాసులకు పునరావాసం కల్పించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. అధికారులు ప్రతిపాదించిన స్థలం తీసుకోవడానికి బాధితులు ససేమిరా అంటున్నారు.
కర్లపాలెం గ్రామం (పాత చిత్రం)
ఓడరేవు నిర్మాణంలో భాగంగా తొలగించిన గ్రామాల వాసులకు పునరావాసం కల్పించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. అధికారులు ప్రతిపాదించిన స్థలం తీసుకోవడానికి బాధితులు ససేమిరా అంటున్నారు. మేము చెప్పిన చోట ఇవ్వాలని కోరుతున్నారు. అది సాధ్యం కాదని పాలకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇది పీటముడిగా మారింది.
కందుకూరు, న్యూస్టుడే : రామాయపట్నం ఓడరేవును సుమారు 832 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకోసం మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామాలను తొలగించాలని నిర్ణయించారు. ఇప్పటికే మొండివారిపాలెం, ఆవులవారిపాలెం గ్రామాలకు చెందిన 250 మందికి రామాయపట్నం -తెట్టు మార్గంలో 23 ఎకరాలు కేటాయించారు. అక్కడ ఇప్పటికే మొండివారిపాలెం వాసులు సగానికి పైగా ఇళ్లు నిర్మించుకోగా మిగిలినవి సాగుతున్నాయి. ఆవులవారిపాలెం వాసులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. కర్లపాలేనికి చెందిన సుమారు 200 మందికి పునరావాసం కల్పించాల్సి ఉంది వీరికి నివాస స్థలం కేటాయించడం అధికారులకు సవాలుగా మారింది. సుమారు ఇరవై ఎకరాల స్థలం అవసరం కాగా అంతమొత్తం స్థలం రావూరు, రామాయపట్నం, తెట్టు పరిధిలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు. ప్రైవేటు వ్యక్తుల నుంచి స్థలం కొనుగోలు చేయాల్సి ఉంది. వారు కోరుకున్న చోట స్థలం కొనుగోలు చేయడానికి అధికారులు వెనక్కి తగ్గుతున్నారు.
* రామాయపట్నం సమీపంలో చర్చి పక్కన ఉన్న మాగాణి భూమిని ఇవ్వాలని కోరుతున్నారు. అక్కడ ఎకరా సుమారు రూ.80 లక్షలు ఉందని అంత ఇస్తేనే భూములిస్తామని రైతులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఈ మేరకు ఇచ్చే అవకాశం లేదు. చేవూరులో రైతుల నుంచి సేకరించిన భూమికి రూ.22.50 లక్షలు మాత్రమే ఇచ్చింది. ఎక్కువ ధర కావడంతో అధికారులు కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ స్థలం కేటాయిస్తే చేపల వేటకు అనుకూలంగా ఉంటుందనేది కర్లపాలెం వాసుల వాదన. ఓడరేవుకు రైల్వే లైను వేస్తున్నారు. ఇందుకోసం సాలిపేట సమీపంలోని కాసా కాలనీని తొలగించాలి. సుమారు 80 మందికి పునరావాసం కల్పించాలి. ఇందుకోసం మరో పది ఎకరాలు అవసరం. వీరందరికీ భూమి చూడడం పెద్ద సమస్యగా మారింది.
ఆ స్థలమే మాకు అనుకూలం
మా గ్రామస్థులకు రామాయపట్నం చర్చి సమీపంలోని భూమి అనుకూలంగా ఉంటుంది. అక్కడ రైతులు అధిక ధర చెబుతున్నారు. అధికారులు పరిశీలించి ఆ భూమిని కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి
సి.రమణయ్య, సర్పంచి, సాలిపేట
పరిశీలిస్తున్నాం
కర్లపాలెం, కాసా కాలనీ వాసులకు పునరావాసం కల్పించేందుకు స్థలాన్ని వెదుకుతున్నాం. కర్లపాలెం గ్రామస్థులు సూచించిన భూమి విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి ఆదేశాలతో భూమిని కొనుగోలు చేస్తాం.
సూర్యనారాయణ సింగ్, తహసీల్దారు, గుడ్లూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..