తెదేపాపై వివక్ష.. యువతకు శిక్ష
జిల్లాలో యువతకు ఉపాధి కరవైంది. ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అయిదేళ్లుగా కొత్తగా పరిశ్రమలు రాలేదు.
జిల్లాలో యువతకు ఉపాధి కరవైంది. ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అయిదేళ్లుగా కొత్తగా పరిశ్రమలు రాలేదు. దీంతో చదువుకున్నవారు నిరుద్యోగులుగా మారుతున్నారు. కనీసం నైపుణ్య శిక్షణలు కూడా ఇవ్వడం లేదు. దీంతో యువత ఉపాధి కరవై జీవనం భారంగా గడుపుతోంది.
న్యూస్టుడే బృందం
నాలుగేళ్లుగా ఇంటి వద్ద ఉంటున్నా
శశికుమార్, నార్తుమోపూరు
నాకు డిగ్రీ పూర్తయింది. ఉద్యోగం చేసేందుకు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకాలేదు. దీంతో ఇంటి దగ్గరే ఉంటున్నాను. మా నాన్నతో పాటు పొలం పనికి పోతున్నాను.
యువతకు వలసలు తప్పడం లేదు
ఎన్.జయరామ్, వ్యాపారి
స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక.. పొట్ట కూటి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగాలు లభిస్తాయి.
దురుద్దేశంతోనే పరిశ్రమలు తరలింపు:
ఎం.సాయికృష్ణ, ప్రైవేటు అధ్యాపకుడు
చంద్రబాబునాయుడు రామాయపట్నం ఓడరేవుకు అనుబంధంగా ఏషియన్ పేపరు పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. దీన్ని సీఎం జగన్ తరిమేశారు. సదరు పరిశ్రమ ఏర్పాటైతే యువతకు వేలాదిగా ఉద్యోగాలు లభించేవి. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు.
ఉద్యోగాలేవీ?
- ఎర్రంశెట్టి ఉదయకుమార్, కావలి
ప్రస్తుత వైకాపా పాలనలో పరిశ్రమలు ఏర్పాటుకాలేదు. దీంతో యువతకు ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తే ఉద్యోగాలు వస్తాయి. కేవలం వాలంటీరు పోస్టులను కట్టబెట్టి యువతను మభ్యపెట్టేందుకు మాత్రమే పాలకులు పరిమితమయ్యారు. ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. జాబ్ క్యాలెండర్ అంశంలోనూ మాట తప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముస్లిం మైనార్టీల అభ్యున్నతిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది!
[ 29-04-2024]
‘రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కూటమిగా పోటీ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ఎన్డీయేతో కలిసిన తెదేపా ప్రభుత్వంలో విశేషంగా కృషి చేశాం. మళ్లీ కూటమికి ఓటేసి గెలిపిస్తే.. మరింతగా పాటుపడతాన’ని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. -
ఆత్మస్తుతి.. హామీల ఊసేది
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు. -
గొప్పలు.. ప్రజారోగ్యానికి తిప్పలు
[ 29-04-2024]
ప్రతి గ్రామానికి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నాడు-నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. ఉప, పట్టణ ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నా.. -
చెంతనే నీరున్నా.. చింతే నాయకా
[ 29-04-2024]
వేసవి వచ్చింది... నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పొంచిఉంది. నీటి వనరులున్నా.. నిర్వ హణ లోపంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. పథకాలున్నా.. -
జగనూ.. చెరువులను మింగేస్తున్నారు
[ 29-04-2024]
పూర్వీకులు ఎంతో ముందుచూపుతో చెరువులను ఏర్పాటుచేశారు. గొలుసుకట్టు విధానంలో ఉండడంతో వరద నివారణ సాధ్యమయ్యేది. భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి అవసరాలు తీరడంతో పాటు సాగుకు ఆధారంగా ఉన్నాయి. -
సంగం హామీకి సున్నం
[ 29-04-2024]
దుష్ట సంహారం నిమిత్తం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సుని ‘పినాక ’అంటారు. పినాక ధారుడైన పరమశివుడిని ‘పినాకపాణి’ అని భక్తులు పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రం నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది వంపులు తిరిగి శివుడి విల్లు పినాక ఆకారంలో ఉండటంతో పెన్నానది అని పిలుస్తున్నారు. -
అక్రమాలకు పాల్పడిన ఏపీజీబీ మేనేజర్ అరెస్టు
[ 29-04-2024]
అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్గా పని చేసిన కమతం పెంచల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెసిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్ఐ మగ్బూల్బాషా తెలిపారు. -
సమకూరని మౌలిక వసతులు
[ 29-04-2024]
మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. -
పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్లో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్ను సాధారణ పరిశీలకులు నితిన్ సింగ్ బదారియ, -
వేడుకగా మహా పట్టాభిషేకం
[ 29-04-2024]
బాలాజీనగర్లోని సీతారామ మందిరంలో ఆదివారం స్వామివారికి మహా పట్టాభిషేక వేడుకలు చేపట్టారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్