సమస్యలు..పట్టని వైకాపా పాలకులు
ఇందిరానగర్ కాలనీ, ఎస్సీ కాలనీ, సినిమాహాల్ సెంటర్, శ్రీనగర్ కాలనీ, మంగళికట్ట, యూనియన్ రోడ్డు సమస్యలు: తాగునీటి సరఫరా, రోడ్లపై చెత్తకుప్పలు, పూడిక చేరిన మురుగు కాలువలు తదితర సమస్యలు వేధిస్తున్నాయి.
ఉదయగిరి, న్యూస్టుడే: పంచాయతీ: ఉదయగిరి .. వార్డులు: 1,2,3,4
పూడిక తీయని కాలువ
ప్రాంతాలు: ఇందిరానగర్ కాలనీ, ఎస్సీ కాలనీ, సినిమాహాల్ సెంటర్, శ్రీనగర్ కాలనీ, మంగళికట్ట, యూనియన్ రోడ్డు సమస్యలు: తాగునీటి సరఫరా, రోడ్లపై చెత్తకుప్పలు, పూడిక చేరిన మురుగు కాలువలు తదితర సమస్యలు వేధిస్తున్నాయి. ఆయా కాలనీల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. నీటి సరఫరా నాలుగు రోజులకొకసారి చేస్తున్నారు. చెత్తాచెదారం వేసేందుకు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 1983లో ఏర్పాటు చేసిన పక్కా గృహాలు దెబ్బతిన్నాయి. దీంతో పేదలు ఆ ఇళ్లలో ఉండలేకపోతున్నారు. రోడ్లు కంకర లేచి ప్రమాదకరంగా ఉన్నాయి. - శ్రీనగర్ కాలనీలో కుళాయిలకు నీటి సరఫరా మూడు రోజులకొకసారి వస్తోంది. సీసీ రోడ్లు కొన్నిచోట్ల దెబ్బతిన్నాయి. మంగళికట్ట వీధిలో రోడ్లు దుస్థితికి చేరాయి.
పట్టించుకునేవారు లేరు
- కె.లక్ష్మీదేవి
ఇందిరానగర్ కాలనీలో సమస్యలతో సతమతమవుతున్నాం. అయినా నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కాలువలే లేవు. ఉన్న వాటిని శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి. చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన కాలనీలు శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం వాటిల్లో నివసించలేకపోతున్నారు.
పరిష్కరించేవారు ఏరీ
- ఉయ్యాల రమాదేవి
స్థానిక సమస్యల గురించి చెప్పినా ఆలకించేవారు లేరు. ఎన్నికల సమయంలో గొప్పలు చెబుతూ అనంతరం పట్టించుకోవడంలేదు. నీటి సరఫరా సరిగా లేదు. కనీసం చెత్త వేసుకునేందుకు స్థలం కూడా లేదు. సమస్యలతో పేదలు సతమతమైపోతోన్న ఆలకించే నాథులే లేకుండా పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముస్లిం మైనార్టీల అభ్యున్నతిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది!
[ 29-04-2024]
‘రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కూటమిగా పోటీ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ఎన్డీయేతో కలిసిన తెదేపా ప్రభుత్వంలో విశేషంగా కృషి చేశాం. మళ్లీ కూటమికి ఓటేసి గెలిపిస్తే.. మరింతగా పాటుపడతాన’ని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. -
ఆత్మస్తుతి.. హామీల ఊసేది
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు. -
గొప్పలు.. ప్రజారోగ్యానికి తిప్పలు
[ 29-04-2024]
ప్రతి గ్రామానికి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నాడు-నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. ఉప, పట్టణ ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నా.. -
చెంతనే నీరున్నా.. చింతే నాయకా
[ 29-04-2024]
వేసవి వచ్చింది... నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పొంచిఉంది. నీటి వనరులున్నా.. నిర్వ హణ లోపంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. పథకాలున్నా.. -
జగనూ.. చెరువులను మింగేస్తున్నారు
[ 29-04-2024]
పూర్వీకులు ఎంతో ముందుచూపుతో చెరువులను ఏర్పాటుచేశారు. గొలుసుకట్టు విధానంలో ఉండడంతో వరద నివారణ సాధ్యమయ్యేది. భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి అవసరాలు తీరడంతో పాటు సాగుకు ఆధారంగా ఉన్నాయి. -
సంగం హామీకి సున్నం
[ 29-04-2024]
దుష్ట సంహారం నిమిత్తం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సుని ‘పినాక ’అంటారు. పినాక ధారుడైన పరమశివుడిని ‘పినాకపాణి’ అని భక్తులు పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రం నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది వంపులు తిరిగి శివుడి విల్లు పినాక ఆకారంలో ఉండటంతో పెన్నానది అని పిలుస్తున్నారు. -
అక్రమాలకు పాల్పడిన ఏపీజీబీ మేనేజర్ అరెస్టు
[ 29-04-2024]
అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్గా పని చేసిన కమతం పెంచల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెసిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్ఐ మగ్బూల్బాషా తెలిపారు. -
సమకూరని మౌలిక వసతులు
[ 29-04-2024]
మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. -
పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్లో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్ను సాధారణ పరిశీలకులు నితిన్ సింగ్ బదారియ, -
వేడుకగా మహా పట్టాభిషేకం
[ 29-04-2024]
బాలాజీనగర్లోని సీతారామ మందిరంలో ఆదివారం స్వామివారికి మహా పట్టాభిషేక వేడుకలు చేపట్టారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!