వైకాపా నాయకుల దందా
వైకాపా పాలన కొద్ది రోజుల్లో ముగియనుండటంతో.. ఉన్న కొద్ది రోజుల్లోనే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొందరు వైకాపా నాయకులు దందాలకు పాల్పడుతున్నారు.
రోడ్డు అంచున స్థలాలు ఆక్రమించి అద్దెకు}
న్యూస్టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)
ప్రధాన రైల్వేస్టేషన్ ఎదురుగా రోడ్డునుఆక్రమించి పూల మొక్కల వ్యాపారం
వైకాపా పాలన కొద్ది రోజుల్లో ముగియనుండటంతో.. ఉన్న కొద్ది రోజుల్లోనే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొందరు వైకాపా నాయకులు దందాలకు పాల్పడుతున్నారు. రహదారుల పక్కనున్న ఖాళీ స్థలాలను వారి అనుచరులతో ముందుగా ఆక్రమించి ఆ తర్వాత స్వాధీనం చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలువురు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంపై నగరవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు ఆక్రమణకు గురి కావడంతో పాటు కుంచించుకు పోతున్నాయి.
అధికార పార్టీ కార్యకర్తలే సూత్రధారులు
నెల్లూరు నగరంలో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఆక్రమణల దందా నడిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నగరంలోని ఇరుగాళమ్మ సంఘం, బట్వాడిపాళెం, ఆత్మకూరు బస్టాండు, మద్రాసు బస్టాండు, ముత్తుకూరు రోడ్డు, కరెంటు ఆఫీసు సెంటరు, సర్వజన ఆసుపత్రి తదితర ప్రాంతాల్లోని రోడ్ల పక్కన ఇటీవల ఆక్రమణలు ఎక్కువయ్యాయి. స్థలాలను ఆక్రమించి దుకాణాలు వేసి నిరుపేదలకు అద్దెలకు ఇస్తున్నారు. ఒక్కో దుకాణానికి ప్రాంతాన్ని బట్టీ నెలకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. తొలుత తాత్కాలిక బడ్డీ దుకాణాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్డుపక్కన ఆక్రమణలపై గతంలో కొందరు స్పందనలో కలెక్టర్కు, కమిషనర్కు ఫిర్యాదులు చేశారు. నెలలు గడుస్తున్నా.. స్పందన లేదు. అధికారులు స్పందించి ఆక్రమణలు అడ్డుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముస్లిం మైనార్టీల అభ్యున్నతిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది!
[ 29-04-2024]
‘రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కూటమిగా పోటీ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ఎన్డీయేతో కలిసిన తెదేపా ప్రభుత్వంలో విశేషంగా కృషి చేశాం. మళ్లీ కూటమికి ఓటేసి గెలిపిస్తే.. మరింతగా పాటుపడతాన’ని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. -
ఆత్మస్తుతి.. హామీల ఊసేది
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు. -
గొప్పలు.. ప్రజారోగ్యానికి తిప్పలు
[ 29-04-2024]
ప్రతి గ్రామానికి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నాడు-నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. ఉప, పట్టణ ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నా.. -
చెంతనే నీరున్నా.. చింతే నాయకా
[ 29-04-2024]
వేసవి వచ్చింది... నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పొంచిఉంది. నీటి వనరులున్నా.. నిర్వ హణ లోపంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. పథకాలున్నా.. -
జగనూ.. చెరువులను మింగేస్తున్నారు
[ 29-04-2024]
పూర్వీకులు ఎంతో ముందుచూపుతో చెరువులను ఏర్పాటుచేశారు. గొలుసుకట్టు విధానంలో ఉండడంతో వరద నివారణ సాధ్యమయ్యేది. భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి అవసరాలు తీరడంతో పాటు సాగుకు ఆధారంగా ఉన్నాయి. -
సంగం హామీకి సున్నం
[ 29-04-2024]
దుష్ట సంహారం నిమిత్తం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సుని ‘పినాక ’అంటారు. పినాక ధారుడైన పరమశివుడిని ‘పినాకపాణి’ అని భక్తులు పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రం నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది వంపులు తిరిగి శివుడి విల్లు పినాక ఆకారంలో ఉండటంతో పెన్నానది అని పిలుస్తున్నారు. -
అక్రమాలకు పాల్పడిన ఏపీజీబీ మేనేజర్ అరెస్టు
[ 29-04-2024]
అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్గా పని చేసిన కమతం పెంచల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెసిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్ఐ మగ్బూల్బాషా తెలిపారు. -
సమకూరని మౌలిక వసతులు
[ 29-04-2024]
మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. -
పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్లో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్ను సాధారణ పరిశీలకులు నితిన్ సింగ్ బదారియ, -
వేడుకగా మహా పట్టాభిషేకం
[ 29-04-2024]
బాలాజీనగర్లోని సీతారామ మందిరంలో ఆదివారం స్వామివారికి మహా పట్టాభిషేక వేడుకలు చేపట్టారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!