కడలికి తూట్లు.. అక్రమార్కులకు కాసులు
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
నియమావళి ఉన్నా బేఖాతరు
నిల్వ చేస్తున్న సముద్రపు ఇసుక
కావలి, న్యూస్టుడే : ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది నిర్మాణాలకు పనికిరాదు. వైకాపా పాలనలో ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కావలి మండలంలోని సముద్రతీరం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నదులు, వాగుల నుంచి తీసుకొచ్చిన ఇసుకలో కలుపుతున్నారు. కొన్నేళ్లుగా ఈప్రాంతంలో యథేచ్ఛగా చేస్తున్నారు. దీన్ని భవన నిర్మాణాలకు వినియోగించడంతో అనతికాలంలోనే దెబ్బతింటున్నాయి.
- పట్టణంలో ఏర్పాటుచేసిన జగనన్న మెగా లేఅవుటË్లో ఇళ్ల నిర్మాణాలకు సముద్రపు ఇసుకనే ఎక్కువగా వినియోగించారనే విమర్శలున్నాయి. దీంతో ఓ వైపు నిర్మాణాలు జరుగుతుండగా మరోవైపు దెబ్బతింటున్నాయి. గత ఏడాది డిసెంబరులో వచ్చిన వర్షాలకు కూలిపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూడా సముద్రపు ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుధవారం ఉదయం కావలి మండలంలోని నందెమ్మపురం సమీపంలో తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పొక్లెయినర్లు, టిప్పర్లను ఏర్పాటుచేసి దందా సాగిస్తున్నారు. భారీ డంప్ను ఏర్పాటు చేసుకుని తరలిస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయమై కావలి గ్రామీణ సీఐ కావేటి శ్రీనివాస్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా, ఫిర్యాదులు రావడం వాస్తవమేనని వివరించారు. అయితే, అక్కడకు వెళ్లి చూడగా ఆప్రాంతం పొరుగు స్టేషన్ గుడ్లూరు పరిధిలోకి వస్తుందన్నారు. దీంతో ఆ స్టేషన్కు సమాచారం ఇచ్చామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛన్ల నీడ.. వైకాపా చీడ
[ 30-04-2024]
-
పార్లమెంటు అభ్యర్థులకు గుర్తులు
[ 30-04-2024]
నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారికి కలెక్టర్ హరినారాయణన్ ఎన్నికల గుర్తులు కేటాయించారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
[ 30-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సోమవారంతో నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. -
దగాపడ్డ రైతు దళారీకే మద్దతు!
[ 30-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుంది. జగన్ సీఎం అయ్యాక గిట్టుబాటు ధరలు లేక రైతులు కుదేలవుతున్నారు. -
ప్రభుత్వ భూములు మింగేశారు
[ 30-04-2024]
వింజమూరు మండలంలో వైకాపా నాయకులు, మద్దతుదారులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి అనుభవిస్తున్నారు. -
జగనన్నా.. ఈ ప్రాంగణాలేందన్నా!
[ 30-04-2024]
ప్రయాణికుల క్షేమమే మా లక్ష్యం.. వారికే ప్రథమ ప్రాధాన్యం.. ఇవీ ఆర్టీసీ బస్సులు.. ప్రాంగణాల్లో కనిపించే నినాదాలు. -
అగ్రిగోల్డ్ భూముల్లోని కలప అక్రమ రవాణా
[ 30-04-2024]
మండలంలోని రాచవారిపల్లి- తురకపల్లి మార్గంలో సుమారు 200 ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూముల్లోని కలపను అక్రమార్కులు తరలిస్తుండగా స్థానికులు గుర్తించారు. -
పరిహారం పేరుతో జగన్నాటకం
[ 30-04-2024]
పల్లె ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఎన్నికల నియమావళి అమలుకు ఒకరోజు ముందు భూసేకరణ ప్రకటన విడుదల చేసింది. -
ఉలవపాడులో స్టిక్కర్ల దుమారం
[ 30-04-2024]
మండల కేంద్రంలో సోమవారం వైకాపా గుర్తుతో స్టిక్కర్లు అంటించడంపై దుమారం రేగింది. వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వచ్చి పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు అంటించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!