logo

వైకాపాకు షాక్‌.. తెదేపాలో చేరిన కీలక నేతలు

తెదేపాలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ డివిజన్లలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న ముఖ్య నాయకులు  వైకాపాను వీడి తెదేపాలో చేరుతున్నారు.

Published : 18 Apr 2024 10:12 IST

నెల్లూరు కలెక్టరేట్‌:  తెదేపాలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ డివిజన్లలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న ముఖ్య నాయకులు  వైకాపాను వీడి తెదేపాలో చేరుతున్నారు. నెల్లూరు రూరల్‌  20వ డివిజన్‌ వైకాపాలో కీలకంగా పనిచేస్తున్న  అన్నంగి రమణయ్య, డబ్బుగుంట వెంగయ్య, పాలకుర్తి శ్రీనివాసులు మరికొంతమందితో కలిసి  తెదేపాలో చేరారు. తెదేపా  ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెదేపా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించుకుంటామని ప్రకటించారు. వారి వెంట  కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,  స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్, దిలీప్, పలువురు తెదేపా నేతలు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని