మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి.
న్యూస్టుడే, వెంకటాచలం, విడవలూరు
వెంకటాచలంలోని పరిశ్రమల కేంద్రం
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. ప్రభుత్వం నుంచి తక్కువ ధరలకు దక్కించుకున్న స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి... గతంలో అరకొర పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత కొన్ని మూతపడ్డాయి.
వెంకటాచలంలోని కాకుటూరు పంచాయతీ పరిధిలో గొలగమూడి రోడ్డు వద్ద జాతీయ రహదారి సమీపంలో కొన్నేళ్ల క్రితం పరిశ్రమల కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పట్లో పరిశ్రమల ఏర్పాటునకు పలువురు దరఖాస్తులు చేసుకోగా అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు స్థలాలు కేటాయించారు. కొందరికి తక్కువ ధరలకే అప్పగించారు. ఇక్కడి స్థలాలకు మంచి గిరాకీ ఉండటంతో వందల కొద్ది దరఖాస్తులొచ్చాయి. అందరికీ స్థలాలిచ్చారు. నిబంధనల ప్రకారం దరఖాస్తులో పేర్కొన్న విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా 80 శాతం మంది అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. పది శాతం మాత్రమే పరిశ్రమలు నిర్మించి అరాకొరగా స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. కొందరు వాటిని అద్దెకివ్వగా... మరి కొందరు అతిథి గృహాలుగా వినియోగిస్తున్నారు.
క్రిభ్కో సా...గుతోంది
సర్వేపల్లి పంచాయతీ పరిధిలో క్రిభ్కో సంస్థ ఎరువుల కర్మాగారం ఏర్పాటునకు 2015లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఏపీˆఐఐసీˆ ద్వారా మొత్తం 289 ఎకరాలు కేటాయించింది. రూ.2వేల కోట్లతో కర్మాగారం ఏర్పాటు చేసి వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. పరిశ్రమ ఏర్పాటునకు 2016లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత పట్టించుకోలేదు. ఆరు నెలల క్రితం బయో ఇథనాల్ కేంద్రం ఏర్పాటునకు శంకుస్థాపన చేయగా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఇదే పంచాయతీ పరిథిలో పైపుల తయారీ కర్మాగారం ఏర్పాటునకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. తెదేపా పాలనలో పైపుల తయారీ పనులు నిర్వహిస్తుండగా ఏడాదిన్నర నుంచి నిలిపేశారు.
ఉపాధి ఏదీ?
స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్న లక్ష్యంతోనే పరిశ్రమల కేంద్రం ఏర్పాటు చేసి తక్కువ ధరలకు స్థలాలిచ్చారు. పరిశ్రమల కేంద్రం ఏర్పాటైతే ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్థానికులు ఆశించారు. క్రమంగా ఏర్పాటు చేసినవి మూసివేయడంతో ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. వెంకటాచలంలోని పరిశ్రమల కేంద్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గతంలో ఒక గదిలో ఎర్ర చందనం దుంగల నిల్వలు పట్టుబడగా... ఒక పరిశ్రమలో నిషేధిత గుట్కాలు తయారు చేస్తూ పట్టుబడ్డారు. అక్కడ నిర్మించిన గదుల్లో జూదం ఆడుతూ పలుమార్లు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక పరిశ్రమలో నూనె అక్రమంగా తయారు చేస్తుండగా పట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరిన ఆరుగురు వాలంటీర్లు
[ 06-05-2024]
కావలి పట్టణంలోని 9వ వార్డుకు చెందిన ఆరుగురు వాలంటీర్లు తెదేపాలో చేరారు. -
బ్యాలెట్ పేపర్పై అవగాహన కలిగించాలి
[ 06-05-2024]
కావలిలోని తెదేపా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో 23వ వార్డ్లో సమావేశం నిర్వహించారు. -
తెదేపాలో చేరికలు
[ 06-05-2024]
దగదర్తి మండలం యలమంచిపాడు పంచాయతీకి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. -
రాకాసి చట్టం.. రాబందులకే చుట్టం!
[ 06-05-2024]
కొత్త చట్టంలో టీఆర్వోలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. ఏ స్థాయి అధికారికి బాధ్యత అప్పగిస్తారనే దానిపై స్పష్టత లేదు. -
నెల్లూరు గళం పార్లమెంట్లో వినిపిస్తాం
[ 06-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు గతంలో ఈ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇక్కడి సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగం.. తొలిరోజే గందరగోళం!
[ 06-05-2024]
జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్కు దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఒక్కరితో బోధనెలా మామయ్యా!
[ 06-05-2024]
కోవూరు మండలం మోడేగుంటలోని ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. -
ఈ జలం గరళం
[ 06-05-2024]
వేసవికాలం వచ్చింది. తాగునీటి వనరులు అడుగంటి కలుషితమవుతాయి. ఈనీరు తాగి వ్యాధులు ప్రబలుతాయి. -
పింక్ మోడల్ పోలింగ్ కేంద్రం ప్రారంభం
[ 06-05-2024]
పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పింక్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జనరల్ పరిశీలకులు రామ్కుమార్గౌతమ్, సబ్కలెక్టర్ జి.విద్యాధరి ప్రారంభించారు. -
అంబటి చెప్పినా ఏదీ ఫలితం?
[ 06-05-2024]
మెరుపు వరదలకు.. పెన్నానది పెట్టింది పేరు. దీనికి కుందు, సగిలేరు, చెయ్యేరు, గుంజనవాగు, పాపాఘ్ని, జయమంగళ, తీతా, బీరాపేరు, బొగ్గేరు తదితర వాగులు, ఉపనదులు ఉన్నాయి. -
మంచి పేరున.. ముంచిన జగన్
[ 06-05-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500, ఆయాలు, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ. 7,500 చెల్లించారు. -
క్షేత్ర సహాయకుడి సస్పెన్షన్
[ 06-05-2024]
కొండికందుకూరు ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని సస్పెండ్ చేసినట్లు ఏపీవో సుజాత తెలిపారు. -
విష గుళికలు మింగి..
[ 06-05-2024]
జలదంకికి చెందిన మింగికళ్లోల వెంకయ్య (40) - వెంగమ్మ దంపతులు కూలీ పనుల కోసం కొన్నిరోజుల క్రితం కరీంనగర్ జిల్లా బంజరుపల్లికి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు