అవసరాల నిధి.. అక్కరకు రాదేమి..!
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సంక్షేమనిధి(జడ్పీ జీపీఎఫ్) ప్రభుత్వ అవసరాల బాంఢాగారంలా మారింది.
చేతికందని అడ్వాన్సులు, పాక్షిక ఉపసంహరణలు
ఎనిమిది నెలలుగా ఎదురుచూపులే..
న్యూస్టుడే, నిజామాబాద్ విద్యావిభాగం: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సంక్షేమనిధి(జడ్పీ జీపీఎఫ్) ప్రభుత్వ అవసరాల బాంఢాగారంలా మారింది. గృహ నిర్మాణం, ఆరోగ్య సంబంధ, వివాహ శుభకార్యాలు, పిల్లల చదువులు తదితరాల కోసం జిల్లాపరిషత్లో జమ చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ నుంచి కొంత రుణం లేదా పాక్షిక ఉపసంహరణలు చేసుకుందామని దరఖాస్తు చేసుకున్నవారు.. వాటి కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ మొత్తాన్ని సర్కారు వినియోగించుకోవడంతో సొమ్ము ఒకరిది..సోకు మరొకరిది అన్న చందంగా మారిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ప్రక్రియ ఇలా..
ప్రతి ఉద్యోగి మూలవేతనంలో 6 శాతం ప్రావిడెంట్ ఫండ్ కింద జమ చేస్తారు(సీపీఎస్ ఉద్యోగులకు ఈ వెసులుబాటు లేదు). అవసరమైనప్పుడు అడ్వాన్సు రుణం కింద ఈ నిధిలో నుంచి 70-80 శాతం తీసుకోవచ్చు. 15 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, 20 ఏళ్లు పూర్తయినవారు గృహ నిర్మాణ, వివాహాది శుభకార్యాలు, పిల్లల చదువుల కోసం పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు.
ఇదీ పరిస్థితి
నిజామాబాద్ జిల్లాపరిషత్ పరిధిలో దాదాపుగా 15 వేల జీపీఎఫ్ ఖాతాలున్నాయి. వీటిలో ఉపాధ్యాయులకు సంబంధించివి 5,500. గతేడాది నవంబరు నుంచి అడ్వాన్సు రుణం, పాక్షిక ఉపసంహరణలకై వచ్చిన దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు. జిల్లాలో దాదాపుగా 600 మంది తమ సొమ్ముకై ఎదురుచూస్తున్నారు. అనధికార ఫ్రీజింగ్ కొనసాగడం, ఈ-కుబేరు వ్యవస్థతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకున్న 1-2 నెలల్లోనే నగదు జమ చేసేవారు.
రూ.15 కోట్ల వడ్డీ బకాయిలు..
* జడ్పీ జీపీఎఫ్కు సంబంధించి 2019-20 వరకు వార్షిక లెక్కల ప్రక్రియ పూర్తయింది. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలవి స్లిప్పుల ప్రక్రియ కొనసాగుతోంది. * జిల్లా కార్యాలయంలోని ఈ విభాగంలో సిబ్బంది తక్కువగా ఉండటంతో రెండు జిల్లాల ఖాతాల విభజన ప్రక్రియ ఇప్పటికీ సాగుతూనే ఉంది. * జడ్పీ జీపీఎఫ్కు సంబంధించి వడ్డి సొమ్ము గత ఆరేళ్లుగా జమ కావడం లేదు. జిల్లాకు దాదాపుగా 15 కోట్ల వడ్డీ జమ కావాల్సి ఉంది.
త్వరగా మంజూరు చేయాలి
- నరేశ్, పీఆర్టీయూ నాయకుడు
చాలా మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు జీపీఎఫ్ రుణం అడ్వాన్సులకై నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి వీలైనంత త్వరగా సొమ్ము మంజూరు చేయాలి. దరఖాస్తుల సీనియారిటీ ఆధారంగా ప్రక్రియ చేపట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ సామాజిక వర్గం ఎటు వైపో..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జహీరాబాద్ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
వేధింపుల కట్టడికి అంతర్గత కమిటీలు
[ 05-05-2024]
పురపాలక కార్యాలయాల్లో, పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నియంత్రించడానికి అంతర్గత కమిటీల ఏర్పాటుకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇందూరు భగభగ
[ 05-05-2024]
ఇందూరులో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. మే ఆరంభంలోనే ఎండ ప్రచండమైంది. జిల్లాలో మూడు ప్రాంతాలు రెడ్ జోన్లోకి వెళ్లాయి. -
శతశాతంతో శెభాష్ అనిపించారు
[ 05-05-2024]
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జంగంపల్లి మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తా చాటారు. -
పల్లెలపైనే పార్టీల ఆశలు
[ 05-05-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో పాగావేసేందుకు భారాస, కాంగ్రెస్, భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రచారసరళిని గమనిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. -
దోస్త్కు వేళాయె..!
[ 05-05-2024]
డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. -
బిల్లులు ఇవ్వకుంటే ధర్నా చేస్తా
[ 05-05-2024]
పెండింగ్లో ఉన్న రెండు పడకగదుల ఇళ్ల బిల్లులు రూ.26 కోట్లు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల తర్వాత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
‘జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదు’
[ 05-05-2024]
కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
‘370 సీట్లతో భాజపా మూడోసారి అధికారంలోకి’
[ 05-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 370 సీట్లతో మూడోసారి కేంద్రంలో భాజపా అధికారం చేపట్టనుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు..!
[ 05-05-2024]
భిక్కనూరు పోలీస్స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న నలుగురు నిందితులను ప్రత్యేక పోలీసు బృందం శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పట్టపగలే దొంగలు పడ్డారు
[ 05-05-2024]
నాలుగో ఠాణా పరిధిలో పట్టపగలే చోరీ కలకలం రేపింది. అరగంట వ్యవధిలోనే ఇల్లు గుల్లచేశారు. వివరాల్లోకి వెళ్తే వినాయక్నగర్ తుల్జా భవానీ మందిరం సమీపంలో మధుసూదన్ తన కుటుంబ సభ్యులతో శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. -
పరీక్ష రుసుము చెల్లింపునకు అవకాశం
[ 05-05-2024]
డా బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 2017 విద్యా సంవత్సరానికి ముందు డిగ్రీలో ప్రవేశం పొందిన, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు బ్యాక్లాగ్ పరీక్ష రుసుము కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి, అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయకర్త రంజిత శనివారం ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ.200తో ఈ నెల 6 వరకు, రూ.500తో 13 వరకు అవకాశం ఉందన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత