ప్రశ్నపత్రం లీక్.. ఉపాధ్యాయుడి అరెస్టు
గుజరాత్లో పంచాయతీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నిర్వహించనున్న జూనియర్ క్లర్క్ పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయిన ఘటనలో మల్కాన్గిరి జిల్లా మథిలి సమితి కర్తనపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు సరోజ్ మల్లును ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
అరెస్టయిన సరోజ్ మల్లుతో పోలీసులు
మల్కాన్గిరి, న్యూస్టుడే: గుజరాత్లో పంచాయతీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నిర్వహించనున్న జూనియర్ క్లర్క్ పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయిన ఘటనలో మల్కాన్గిరి జిల్లా మథిలి సమితి కర్తనపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు సరోజ్ మల్లును ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కొన్ని రోజుల కిందట ఆ రాష్ట్రంలో పంచాయతీ విభాగంలో 1181 జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. పరీక్ష తేదీకి ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. దీంతో చివరి క్షణాల్లో పరీక్షను రద్దు చేశారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసి నిందితులైన 15మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో కర్తనపల్లి ఉపాధ్యాయుడి హస్తం ఉందని దర్యాప్తులో తేలింది. సమాధానపత్రం మల్కాన్గిరి నుంచి వచ్చినట్లు పోలీసులు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమ రాష్ట్రంలో విచారించి, న్యాయస్థానానికి తరలిస్తామని తెలిపారు. గుజరాత్ పోలీసుల ప్రాథమిక నివేదిక ఆధారంగా మల్కాన్గిరి పోలీసులు సహకరించి సరోజ్ మల్లును అరెస్టు చేశారని స్థానిక ఎస్.పి.నితీశ్ వాద్వానీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుటుంబ కధా చిత్రం
[ 05-05-2024]
విశ్వసనీయత, విద్యార్హత, ఆదరణ ఉన్నవారికే ఈసారి ఎన్నికల బరిలో దించుతామన్న ప్రధాన పార్టీలు మాట నెలబెట్టుకోలేదు -
నేడు ప్రధాని మోదీ భువనేశ్వర్ రాక
[ 05-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. -
శాలినీ పండిత్కు మిషన్శక్తి బాధ్యతలు
[ 05-05-2024]
రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శాలినీ పండిత్కు ప్రభుత్వం మిషన్శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. -
చెమటోడుస్తున్న అభ్యర్థులు
[ 05-05-2024]
ఒకవైపు తరుముకొస్తున్న పోలింగు తేదీ.. మరోవైపు సుర్రుమంటున్న సూరీడు.. అభ్యర్థులు మండుటెండల్ని లెక్కచేయకుండా విజయమే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునేందుకు చెమటోడుస్తున్నారు -
అందరి కళ్లూ ‘హింజిలి’పైనే..
[ 05-05-2024]
రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది. -
ఏడుగురు అభ్యర్థులకు నేర చరిత్ర
[ 05-05-2024]
ఈ నెల 13న రాష్ట్రంలోని బ్రహ్మపుర, నవరంగపూర్, కలహండి, కొరాపుట్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. -
రాయగడ జిల్లా కాంగ్రెస్లో అయోమయం
[ 05-05-2024]
ప్రస్తుతం ఎన్నికల సందడిలో నాయకులంతా నిమగ్నమై ఉన్నారు. తమ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
అభివృద్ధికి ఓటేసి మద్దతివ్వండి
[ 05-05-2024]
కొరాపుట్ జిల్లాలో అభివృద్ధికి ఓటేసి బిజదకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడికి అస్వస్థత
[ 05-05-2024]
గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని పుతిలిపోంకలో విద్యుదాఘాతంతో కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు
తాజా వార్తలు (Latest News)
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు