కాషాయం కండువాలు ధరించిన అగ్రనేతలు
దిల్లీ భాజపా కార్యాలయం వేదికగా గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ నేతలు, మరో ప్రముఖ రచయిత్రి కాషాయం కండువాలు ధరించారు.
భాజపా గూటికి భర్తృహరి, సిద్ధాంత్, దమయంతి
స్వాగతించిన నడ్డా, ఇతర నాయకులు
భువనేశ్వర్, న్యూస్టుడే: దిల్లీ భాజపా కార్యాలయం వేదికగా గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ నేతలు, మరో ప్రముఖ రచయిత్రి కాషాయం కండువాలు ధరించారు. ఆ పార్టీ కేంద్ర శాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఉపాధ్యక్షుడు ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాన కార్యదర్శి వినోద్ దావతే, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సమక్షంలో కటక్ సిటింగ్ ఎంపీ భర్తృహరి మెహతాబ్, బ్రహ్మపుర మాజీ ఎంపీ, ఒడియా సినీహీరో సిద్ధాంత్ మహాపాత్ర్, మయూర్భంజ్ జిల్లాకు చెందిన ప్రముఖ సంతాళీ కవి, రచయిత్రి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దమయంతి బెస్రా భాజపాలోకి చేరారు. వీరిని కేంద్ర నేతలు స్వాగతించారు.
మార్పు తథ్యం
కటక్ లోక్సభ స్థానం నుంచి వరుసగా ఆరుసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన భర్తృహరి ఈ నెల 22న బిజద వీడిన సంగతి తెలిసిందే. లోక్సభలో మూడుసార్లు సంసద్రత్న అవార్డులందుకున్న ఆయన తర్కంలో దిట్టగా అన్ని రాజకీయ పార్టీల మన్ననలు అందుకున్నారు. ప్రముఖ ఒడియా దినపత్రిక ‘ప్రజాతంత్ర’ ప్రధాన సంపాదకునిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్న భర్తృహరి బిజద వీడిన తర్వాత ఆ పార్టీ విలువలకు సమాధి కట్టిందని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భాజపాలో చేరిన ఆయన మాట్లాడుతూ... ఈసారి ఎన్నికల్లో ఒడిశాలో మార్పు తథ్యమన్నారు. రాష్ట్రంలో మోదీ హవా కనిపిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ పట్ల అన్నివర్గాల ఓటర్లు ఆకర్షితులయ్యారన్నారు. తాను అనుభవపూర్వకంగా చెబుతున్నానని, అవినీతి పాలనకు తెరదించనున్న ప్రజలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారన్నారు.
ఏ బాధ్యతిచ్చినా స్వీకరిస్తా
2009, 2014లలో జరిగిన ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో బ్రహ్మపుర లోక్సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రముఖ ఒడియా సినీ హీరో సిద్ధాంత్ మహాపాత్ర్ను 2019 ఎన్నికల్లో బిజద నాయకత్వం పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. సిద్ధాంత్ చేతిలో వరుసగా రెండుసార్లు పరాజయం పాలైన చంద్రశేఖర్ సాహు 2019 ఎన్నికల ముందుగా కాంగ్రెస్ను వీడి బిజదలో చేరారు. ముఖ్యమంత్రి నవీన్ ఆయనకు బ్రహ్మపుర లోక్సభ అభ్యర్థిగా చేయడంతో విజయం సాధించారు. మరోవైపు గడిచిన అయిదేళ్లలో బిజద నాయకత్వం చేపట్టిన కార్యక్రమాలకు సిద్ధాంత్ను ఆహ్వానించలేదు. దీంతో ఆవేదనకు గురైన ఆయన భాజపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోదీ పదేళ్ల పాలనా కాలంలో దేశానికి చేసిన సేవల పట్ల ఆకర్షితుడినై తాను తన వంతుగా పని చేయాలని భాజపాలో చేరానని, నాయకత్వం ఎలాంటి బాధ్యతలిచ్చినా నెరవేరుస్తానని చెప్పారు.
ఆమె రాష్ట్రపతి స్నేహితురాలు
మయూర్భంజ్ జిల్లా రాయ్రంగ్పూర్కి చెందిన గిరిజన మహిళ దమయంతి బెస్రా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్నేహితురాలు. జిల్లా కేంద్రం బరిపద కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహించారు. సంతాళీ కవిగా దేశవ్యాప్త మన్ననలందుకున్న దమయంతి ప్రముఖ రచయిత్రి. గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ప్రధాని మోదీ నిష్కళంక పాలన, అభివృద్ధి పనులు చూసి తాను భాజపాలో చేరినట్లు చెప్పారు. బోధన, సాహిత్యం, రచనల్లో ఇంతవరకు తలమునకలైన తాను ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ, ఆదివాసీ మహిళల ప్రగతి ఆశయంగా చేసుకుని భాజపాలో చేరినట్లు చెప్పారు.
ఈ ముగ్గురికీ టికెట్లు?
భాజపాలో చేరిన ఈ ముగ్గురికీ పార్టీ టికెట్లు ఖరారయ్యే అవకాశం ఉంది. భర్తృహరికి మళ్లీ కటక్ స్థానం కేటాయిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 18 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన ఆ పార్టీ నాయకత్వం కటక్, జాజ్పూర్, కొంధమాల్ సీట్లకు పోటీ చేసేది ఎవరో ఇంకా ప్రకటించలేదు. సిద్ధాంత్కు గంజాం జిల్లాలో ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా చేసే సూచనలున్నాయి. దమయంతికి మయూర్భంజ్ జిల్లాలో అసెంబ్లీ సీటు కేటాయించే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పకూలిన రైల్వే కారిడార్ పైకప్పు
[ 28-04-2024]
పూరీ రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న కారిడార్ పైకప్పు ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలింది. -
లారీని ఢీకొన్న బస్సు.. ఇద్దరు మృతి
[ 28-04-2024]
లారీని వెనక నుంచి బస్సు ఢీకొట్టిన ఘటన కటక్ నగరానికి చేరువగా 57వ నెంబరు రహదారి హరడాజల్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. -
బోర్ వెల్ వ్యాన్ బోల్తా.. 12 మందికి గాయాలు
[ 28-04-2024]
బోర్వెల్ వ్యాన్ బోల్తా పడి 12మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో జరిగింది. -
రాజకీయాల్లో కుటుంబ కథా చిత్రం
[ 28-04-2024]
రాజకీయపరంగా కుటుంబ కలహాలు సర్వ సాధారణమే. పలుచోట్ల ఒకే కుటుంబానికి చెందినవారు ప్రత్యర్థులుగా తలపడుతున్న విషయం తెలిసిందే. -
లిఖిత హామీ ఇస్తేనే ఓట్లేస్తాం
[ 28-04-2024]
ఉత్తరాముఖి ప్రాంతంలో సుమారు 172 కుటుంబాలున్నాయి. అక్కడ అంగన్వాడీ, ప్రజారోగ్య కేంద్రం, కల్యాణ మండపం లేవు. ప్రస్తుతం బిజద అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్చంద్రచ్యవు పట్నాయక్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్థానికుల డిమాండ్లు -
బొలంగీర్ కోట రాణి సంగీతా సొంతమయ్యేనా?
[ 28-04-2024]
పశ్చిమ ఒడిశాలోని బొలంగీర్ కోట (లోక్సభ స్థానం)ను మళ్లీ రాణి సంగీతా కుమార్ సింగ్దేవ్ సొంతం చేసుకోగలరా? అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
వ్యవసాయాధికారుల కొరత.. అన్నదాతల వెత
[ 28-04-2024]
రైతుల సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ సేవలు సక్రమంగా అందడం లేదు. వెనుకబడిన కొరాపుట్ జిల్లాలో వ్యవసాయ విభాగం పని తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. -
నేడు నడ్డా, రాహుల్ రాక
[ 28-04-2024]
రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. అగ్రనేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హోంమంత్రి అమిత్షా పర్యటించి వెళ్లిన వెంటనే భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆదివారం సాయంత్రం 5 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటారు. -
పేపరుమిల్లు ఉద్యోగుల సమస్యతో రాజకీయం
[ 28-04-2024]
జయపురం పేపరు మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినిపతి విఫలమయ్యారని బిజద మాజీ మంత్రి రబినారాయణ నందో ఆరోపించారు. -
శతాధిక ఓటర్లకు సత్కారం
[ 28-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం పురసంస్థ పరిధిలో వంద సంవత్సరాలు దాటిన ఓటర్లకు యంత్రాంగం సత్కరించింది. కలెక్టరు మనోజ్ సత్యవాన్ మహాజన్ ఆదేశాలు, -
అఠమల్లిక్లో ధర్మేంద్రకు జన నీరాజనం
[ 28-04-2024]
సంబల్పూర్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు జనం నీరాజనాలు పడుతున్నారు. శనివారం సంబల్పూర్ పరిధిలోని అఠమల్లిక్ అసెంబ్లీ సెగ్మెంటులో పర్యటించిన ఆయనకు ప్రజాదరణ కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!