అటకెక్కిన ఆశయం
స్వచ్ఛ పట్టణాలే ధ్యేయంగా పురపాలికలు, నగర పంచాయతీల్లో చేపట్టిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు మూడడుగులు ముందుకు..
పట్టణాల్లో నిలిచిన మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం
సాలూరు పురపాలికలో వేగావతి నదిలో కలుస్తున్న వ్యర్థజలాలు
బొబ్బిలి, విజయనగరం పట్టణం, నెల్లిమర్ల, పార్వతీపురం పురపాలిక, సాలూరు, న్యూస్టుడే: స్వచ్ఛ పట్టణాలే ధ్యేయంగా పురపాలికలు, నగర పంచాయతీల్లో చేపట్టిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలు మూడడుగులు ముందుకు.. ఆరడుగుల వెనక్కు అన్న చందంగా మారాయి. ఫలితంగా లక్ష్యం నీరుగారుతోంది. మురుగు నీరును ఓ చోట చేర్చి.. శుద్ధి చేసేందుకు ప్లాంట్ల నిర్మాణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రూ.కోట్లలో నిధులు కేటాయించారు. కొన్నిచోట్ల సగం ప్రక్రియ జరగ్గా.. మరికొన్ని ప్రాంతాల్లో స్థల సేకరణతో ఆపేశారు.
జిల్లా కేంద్రానికి మోక్షమెప్పుడో?
విజయనగరంలో పెద్దచెరువు వద్ద నాలుగేళ్ల కిందట అమృత్ ఫేజ్-2లో రూ.19.92 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్లాంటు పనులు మధ్యలో నిలిచిపోయాయి. దీంతో ఏడు ఇన్లెట్ కాలువల ద్వారా మురుగు చెరువులోనికి చేరుతోంది. 2018లో స్వచ్ఛాంధ్ర ఆధ్వర్యంలో నిర్మించిన ప్లాంటు నిరుపయోగంగా ఉంది. 18 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన శుద్ధీకరణ విభాగం ఇప్పటికే నిరుపయోగంగా మారింది.
పనుల్లో జాప్యం..
పార్వతీపురంలో వరహాలగెడ్డ పక్కనే శుద్ధీకరణకు స్థల సేకరణ చేపట్టారు. పట్టణంలోని మరో రెండు చోట్ల ఏర్పాటుకు సర్వే నిర్వహించినా స్థల సమస్య నెలకొంది. దీనివల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. బంగారమ్మకాలనీ, జనశక్తి కాలనీలో కొంత భాగం, బెలగాం శివారు ప్రాంతం, సాయిరాం కాలనీ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య ఉంది.
కొలిక్కిరాని స్థల సమస్య..
బొబ్బిలి పురపాలక పరిధిలో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు తొలుత మూడుచోట్ల స్థలాలను చూశారు. రాజానగర్ కాలనీ, మేదరబంద, నాయుడుకాలనీలో నిర్మాణానికి ఆలోచన చేశారు. రాజానగర్ కాలనీలో సుమారు ఎకరన్నర ప్రభుత్వం స్థలం అందుబాటులో ఉండడంతో తొలి విడతలో ఇక్కడ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. మిగిలిన ప్రాంతాల్లో సమస్య కొలిక్కి రాలేదు. ఈ పనులకు సుమారు రూ.7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందిరమ్మ, ఐటీఐ, నాయుడుకాలనీలు, కంచరవీధి, బాలాజీనగర్, దాడితల్లి, అంబేడ్కర్ కాలనీల్లో కాలువలు లేక మురుగంతా రోడ్లపైనే పారుతోంది.
నెలిమర్లలో నత్తనడకన...
నగర పంచాయతీలో 15వ ఆర్థిక సంఘ నిధుల్లో రూ.44 లక్షలు కేటాయించారు. స్థానికంగా ఇంకా స్థల అన్వేషణలోనే ఉంది. దీంతో మురుగు నీరు ముందుకు పారక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబునగర్ కాలనీ, జరజాపుపేటలోని బీసీకాలనీ, శివాలయం వీధి, తాడుతూరి వీధుల్లో కాలువలు లేవు.
సాలూరులో ఇలా..
పట్టణంలోని మురుగును వేగావతి నదిలోకి వదిలేస్తున్నారు. గుమడాం వద్ద ఎకరాన్నర స్థలం సేకరించినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. సుమారు రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దాసరివీధి, కోటలో భాగం, సత్యసాయినగర్, సాయినగర్ కాలనీ, గుమడాం, బంగారమ్మకాలనీల్లో కాలువల వ్యవస్థ లేదు. కొత్తగా నిర్మించి ప్రధాన కాలువలకు అనుసంధానం చేయాలి.
అధికారుల మాట ఇదీ.. స్థల సమస్య ఇంకా కొలిక్కి రాలేదని, అది పరిష్కారమయ్యాక అనుసంధాన ప్రక్రియను ప్రారంభిస్తామని బొబ్బిలి పుర కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. నగరంలో రెండు ప్లాంట్ల నిర్మాణానికి రూ.38.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు నగరపాలక సంస్థ ఈఈ శ్రీనివాసరావు, ప్రజారోగ్యశాఖ ఈఈ దక్షిణామూర్తి చెప్పారు. నెల్లిమర్లలో కసరత్తు జరుగుతోందని కమిషనర్ బాలాజీప్రసాద్ వివరించగా.. పార్వతీపురంలో దశలవారీగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రామప్పలనాయుడు వెల్లడించారు. సాలూరులో తొలుత గుమడాంలో ఏర్పాటు చేయనున్నామని కమిషనర్ శంకరరావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే గిరిజన సమస్యల పరిష్కారం
[ 30-04-2024]
తెదేపా అధికారంలోకి వస్తేనే గిరిజనుల కష్టాలు తీరుతాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. -
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
[ 30-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు యంత్రాంగానికి సహకరించాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు ప్రమోద్కుమార్ మెహర్ద అన్నారు. -
అందరూ నన్ను తిట్టుకుంటే.. మీరు ఓట్లు దండుకుంటారా..
[ 30-04-2024]
ఒకటా.. రెండా.. 26 నెలలుగా నన్ను ఏ ఒక్క నాయకుడూ నన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. నాపై రాళ్లు తేలి.. గుంతలుగా మారడంతో ఎందరో ప్రయాణికులు అదుపుతప్పి నన్నే తిట్టుకున్నారు. -
వైకాపా నుంచి భారీగా వలసలు
[ 30-04-2024]
మండలంలోని చెముడు వైకాపా ఎంపీటీసీ సభ్యుడు చింతల గోపాలకృష్ణ సోమవారం తెదేపాలో చేరారు. సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో మండల అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు కండువా వేసి ఆహ్వానించారు. -
పైసాచికత్వం
[ 30-04-2024]
మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒకటో తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అనుబంధమన్నావు అనాధలా వదిలేశావు!
[ 30-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన సాలూరులో వేల కుటుంబాలకు జీవనాధారం ఆటోనగర్. పద్నాలుగేళ్ల కిందట దీనికి బీజం పడింది. ఇది అభివృద్ధి చేస్తే పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరడంతో పాటు కార్మికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. -
నీకు చేతులెలా వచ్చాయమ్మా?
[ 30-04-2024]
మానవత్వం మంటగలిసిపోతోంది.. కళ్లు తెరవని పసిగుడ్డును దారుణంగా చెత్తలో పడేసిన ఘటన మెంటాడ మండలంలో చోటుచేసుకుంది. ఆండ్ర గ్రామానికి వెళ్లే వంతెన కింద చెత్తలో పసికందు మృతదేహం కనిపించింది. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
[ 30-04-2024]
మండలంలోని రాజాపులోవ గ్రామానికి చెందిన వివాహిత చందక పుష్ప బలవన్మరణానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. -
రాజీనామాకు ఒక్కరోజే గడువట!
[ 30-04-2024]
వాలంటీర్లంతా మే 1 లోగా రాజీనామా సమర్పించాలని అధికార పార్టీ ఒత్తిడి చేస్తోంది. ఈమేరకు స్థానిక నాయకులు వారిని కలిసి..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!