ఔత్సాహికం.. అల్లంతదూరం
ఉమ్మడి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనే మాట వినిపించడం లేదు. వారికి అందించాల్సిన శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు దూరమయ్యాయి. దీంతో నిరుద్యోగ సమస్య రానురానూ తీవ్రమవుతోంది.
కొత్త పారిశ్రామిక వేత్తలకు కానరాని శిక్షణలు
మూడేళ్లుగా నిలిచిన ప్రక్రియ
న్యూస్టుడే, విజయనగరం మయూరికూడలి
స్వయం ఉపాధి యూనిట్ వద్ద యువకులు (పాతచిత్రం)
ఉమ్మడి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనే మాట వినిపించడం లేదు. వారికి అందించాల్సిన శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు దూరమయ్యాయి. దీంతో నిరుద్యోగ సమస్య రానురానూ తీవ్రమవుతోంది. వారికి అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేడంతో కొత్త యూనిట్ల ఏర్పాటూ కలగానే మిగిలింది. ఈక్రమంలో గత ప్రభుత్వంలో నెలకొల్పిన యూనిట్లు నిర్వహణ కష్టసాధ్యంగా మారింది.
యువతకు ఉపాధి కల్పించేందుకు, వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఈడీపీ(ఎంట్రన్షిప్ డెవలప్మెంట్ ప్రొగ్రాం) కింద యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించేవారు. 2018లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పరిశ్రమల స్థాపనకు సంబంధించి యువతకు అవగాహన సదస్సులు నిర్వహించేవారు. అనంతరం ఆసక్తి గలవారికి శిక్షణ ఇచ్చేవారు. అయితే ప్రభుత్వం మారాక ప్రక్రియ మందగించింది. ఈలోపు కొవిడ్ రావడంతో ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈక్రమంలో 2021 ఏప్రిల్ నుంచి పూర్తిగా ఆపేశారు.
నిధులు లేకే..
ఈడీపీ కార్యక్రమం నిర్వహణకు గతంలో పెద్దఎత్తున నిధులొచ్చేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఒక్కో కార్యక్రమానికి సంబంధించి రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేయాలి. శిక్షణలకు వచ్చే వారికి భోజనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. ప్రోత్సాహక బహుమతులు అందజేయాలి. సదస్సుల ఏర్పాటు ఖర్చు అదనం. కొన్నేళ్లుగా నిధులు ఆగిపోవడంతో అధికారులు సైతం ఏమీచేయలేకపోతున్నారు. గతేడాది నుంచి పూర్తిగా బడ్జెట్నే ఆపేశారు.
ప్రక్రియ సాగేదిలా..
ఎంపికైన వారిలో కనీసం 30 మంది లేక అంతకంటే ఎక్కువ మందిని ఒక గ్రూపుగా చేయడం.
మూడు రోజులు పాటు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడం.
లీడ్ బ్యాంకు మేనేజర్(ఎల్డీఎం), ఇండస్ట్రియల్ ప్రమోషన్స్(పరిశ్రమల శాఖ), స్ఫూర్తిదాయక పారిశ్రామిక వేత్తలు), పరిశ్రమల కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో సూచనలు, సలహాలు అందించడం.
పరిశ్రమలు స్థాపించేందుకు కావాల్సిన రిజిస్ట్రేషన్ ప్రతిపాదన, మౌలిక వసతులు, అనుమతులు తెలియజేయడం
ప్రభుత్వ పథకాలు, రుణాలు, రాయితీలను వివరించడం.
మెలకువలు, ఉత్పాదన, ఎదురయ్యే సవాళ్లు, మార్కెటింగ్, స్వయం ఉపాధి, ఉద్యోగాల కల్పన తదితర అంశాలను చెప్పడం.
అనుమతులు వచ్చాయి..
ఈడీపీ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించాలని ఇటీవల ప్రభుత్వం నుంచి రెండు వర్కు ఆర్డర్లు వచ్చాయి. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రారంభించలేదు. త్వరలో చర్యలు తీసుకుంటాం. గతంలో హాజరైన 16 మందితో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయించాం.
నీలం గోవిందరావు, ప్రబంధకుడు, నైపుణ్యాభివృద్ధి సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 27-04-2024]
ఇండియా కూటమి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన మోహనరావుకు, సీపీఎం పార్లమెంట్ అభ్యర్థి పాచిపెంట అప్పలనరసకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం జిల్లా నాయకులు యమ్మల మన్మథరావు, గేదెల సత్యనారాయణ కోరారు. -
కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా
[ 27-04-2024]
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. -
నామపత్రాల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటరీ, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం వరకు దాఖలైన నామపత్రాలను రిటర్నింగ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
[ 27-04-2024]
వైకాపా అరాచక పాలనకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. -
వైనాట్ 175 కాదు.. వైకాపాకు 17
[ 27-04-2024]
జనసేన స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని జనసేన స్టార్ క్యాంపెయినర్, సినీనటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు