జలకలే
ఉమ్మడి జిల్లాలో 2020-21లో జలకళ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. నాలుగేళ్లలో 373 బోర్లకు రూ.5.55 కోట్లతో పరిపాలనా అమోదం ఇచ్చారు.
న్యూస్టుడే-విజయనగరం అర్బన్
ఉమ్మడి జిల్లాలో 2020-21లో జలకళ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. నాలుగేళ్లలో 373 బోర్లకు రూ.5.55 కోట్లతో పరిపాలనా అమోదం ఇచ్చారు. ఇప్పటి వరకు 308 తవ్వగా.. రూ.1.98 కోట్లు చెల్లించినట్లు గణాంకాలు బట్టి తెలుస్తోంది. ఒక బోరు తవ్వకానికి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతోంది. తొలుత నిధులు విడుదలలో జాప్యంతో డ్రిల్లింగ్ ఆలస్యమైంది.
హామీ
బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం.. అందుకు వైఎస్ఆర్ జలకళ పథకంలో రైతుల వ్యవసాయ భూముల్లో ఉచితంగా బోర్లు వేస్తాం.. విద్యుత్తు పంపుసెట్ అమర్చుతాం.
ప్రభుత్వ ప్రకటన
పరిస్థితి
రైతుల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా, పథకం కింద లబ్ధిపొందిన వారు వందల్లో ఉంటున్నారు. అరకొరగా బోర్లు తవ్వారు. తవ్విన వాటికి విద్యుత్తు కనెక్షన్లు, మోటార్లు బిగించకపోవడంతో రైతులకు ఉపయోగం లేకుండా పోతోంది. విద్యుత్తు విషయంలో తొలుత రాయితీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం చివరి సమయంలో రైతులే భరించాలనడంతో ఆర్థిక భారంతో వెనకడుగు వేయాల్సి వస్తోంది.
ప్రతిబంధకాలివే
- ప్రారంభంలో పథకానికి 2.5-10 ఎకరాల భూమి కలిగిన రైతులకే అవకాశం కల్పించారు. దీంతో ఎక్కువ మంది రైతులు అనర్హులయ్యారు. తర్వాత 2.5 ఎకరాల కన్నా తక్కువైతే ఇద్దరు ముగ్గురు రైతులుంటే బోరు వేసేందుకు అవకాశం ఇచ్చారు.
- ఉమ్మడి జిల్లాలో అయిదు ఏజెన్సీలకు బోర్లు డ్రిల్లింగ్ చేసే బాధ్యతలు అప్పగించారు. వీటిలో రెండు ఏజెన్సీలు జిల్లాలోనివే. మిగిలిన మూడు ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాలకు చెందినవి ఉన్నాయి. ప్రారంభంలో నియోజకవర్గానికి ఒక రిగ్ లేకపోవడం, వర్షాలతో డ్రిల్లింగ్ పనులు కొంత నెమ్మదించాయి. తర్వాత బిల్లుల చెల్లింపులో జాప్యంతో ప్రైవేటు ఏజెన్సీలు తవ్వేందుకు నిరాకరిస్తూ వచ్చాయి.
- డ్రిల్ చేసిన బోర్లకు విద్యుత్తు కనెక్షను ఇచ్చి, మోటారు అమర్చాలి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ (సీఆర్డీ), ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) దీనిని అమలు చేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వమే రాయితీ ఇస్తామని చెప్పింది. తర్వాత దీనిని రైతులే భరించాలని చెప్పడంతో వారు ముందుకు రాలేదు. అందుబాటులో ఉన్న విద్యుత్తు సౌకర్యం బట్టి రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు అవుతుందని అధికారులు చెబుతున్నారు.
- జిల్లాలో తొలివిడతగా 203 బోర్లకు విద్యుత్తు కనెక్షన్ల నిమిత్తం 2022లో ఈపీడీసీఎల్ అధికారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మోటార్లకు రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలుస్తారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జిల్లాలో 373 బోర్లు తవ్వితే ఇందులో 40కి విద్యుత్తు సౌకర్యం కల్పించారు. వీటికి మాత్రమే సబ్మెర్సిబుల్ పంప్సెట్లు మంజూరయ్యాయి.
నిబంధనలివీ..
- పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి క్షేత్రస్థాయిలో వీఆర్వోలు అర్హతను నిర్ధారిస్తారు.
- డ్వామా ఏపీడీ సిఫార్సు ఆధారంగా భూగర్భ శాస్త్రవేత్తలు (జియాలజిస్టులు) నీటి లభ్యతపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలి.
- ఎంపిక చేసిన ఏజెన్సీలు బోర్లు వేస్తాయి.
- డ్రిల్ చేసిన బోర్లకు విద్యుత్తు కనెక్షను ఇచ్చి మోటార్ అమర్చాలి.
జిల్లాలో పరిస్థితి
దరఖాస్తులు సుమారు: 10 వేలు
ఆమోదం : 1075
పరిపాలనా ఆమోదం పొందినవి: 373
వ్యయం: రూ.5.55 కోట్లు
డ్రిల్లింగ్ : 373
చెల్లింపులు : 308
మొత్తం : రూ.1.98 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 27-04-2024]
ఇండియా కూటమి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన మోహనరావుకు, సీపీఎం పార్లమెంట్ అభ్యర్థి పాచిపెంట అప్పలనరసకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం జిల్లా నాయకులు యమ్మల మన్మథరావు, గేదెల సత్యనారాయణ కోరారు. -
కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా
[ 27-04-2024]
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. -
నామపత్రాల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటరీ, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం వరకు దాఖలైన నామపత్రాలను రిటర్నింగ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
[ 27-04-2024]
వైకాపా అరాచక పాలనకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. -
వైనాట్ 175 కాదు.. వైకాపాకు 17
[ 27-04-2024]
జనసేన స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని జనసేన స్టార్ క్యాంపెయినర్, సినీనటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్