సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
సూచనలు చేస్తున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్
పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగానే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, సెక్టార్ల ప్రకారం వాటిని విభజించి ప్రత్యేక అధికారులను నియమించాలని, అక్కడ అనుసరించాల్సిన కార్యాచరణను రూపొందించాలని ఎస్పీ సూచించారు.ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన కేంద్ర పోలీసు దళం, ఆర్పీఎఫ్తో జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ల అధికారులు సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పౌరుడు ఓటుహక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేందుకు పటిష్ఠభద్రత చర్యలు తీసుకోవాలన్నారు. గత కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. చెక్పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టాలని సూచించారు. మద్యం, నగదు అక్రమ తరలింపు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సునీల్ షరోన్, డీఎస్పీలు హర్షిత, కృష్ణారావు, మురళీధర్, వెంకట అప్పారావు, శిక్షణ డీఎస్పీ ఎస్ఎండీ అజీజ్, ఎస్బీ సీఐ లక్ష్మణరావు, డీసీఆర్బీ సీఐ బీఎండీ ప్రసాద్ పాల్గొన్నారు.
హాజరైన పోలీసు అధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 27-04-2024]
ఇండియా కూటమి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన మోహనరావుకు, సీపీఎం పార్లమెంట్ అభ్యర్థి పాచిపెంట అప్పలనరసకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం జిల్లా నాయకులు యమ్మల మన్మథరావు, గేదెల సత్యనారాయణ కోరారు. -
కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా
[ 27-04-2024]
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. -
నామపత్రాల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటరీ, నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం వరకు దాఖలైన నామపత్రాలను రిటర్నింగ్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
[ 27-04-2024]
వైకాపా అరాచక పాలనకు ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని కొత్తపల్లి గీత, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి పిలుపునిచ్చారు. -
వైనాట్ 175 కాదు.. వైకాపాకు 17
[ 27-04-2024]
జనసేన స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్పాలకొండ, గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలో కూటమి గెలుపు తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖాయమని జనసేన స్టార్ క్యాంపెయినర్, సినీనటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్